Jacintha Kalyan: అప్పుడు రిసెప్షనిస్ట్.. ఇప్పుడు పిచ్ క్యూరేటర్! ప్రశంసించిన జై షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacintha Kalyan Pitch Curator: క్రీడా చరిత్రలో భారతదేశ మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్గా జసింత కళ్యాణ్ తన పేరును లిఖించుకున్నారు. బెంగుళూరు వేదికగా జరుగుతోన్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో జసింత పిచ్ తయారీ బాధ్యతలను చేపట్టారు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డుల్లో నిలిచారు. ఒకప్పుడు రిసెప్షనిస్ట్గా కెరీర్ ప్రారంభించిన జసింత.. ఇప్పుడు క్రికెట్ పిచ్ క్యూరేటర్గా అవతరిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేస్సీఏ)తో జసింత కళ్యాణ్ 30 సంవత్సరాలుగా అనుబంధం కలిగి ఉన్నారు. 19 ఏళ్ల వయసులో కేస్సీఏలో రిసెప్షనిస్ట్గా జసింత కెరీర్ ఆరంభించారు. ఆపై కేస్సీఏలో పనిచేయడం ప్రారంభించింది. చాలా కాలంగా పిచ్ క్యూరేటర్ల జట్టులో భాగంగా ఉన్నారు. ఇప్పుడు ఆమెకు చీఫ్ పిచ్ క్యూరేటర్గా అవకాశం వచ్చింది. డబ్ల్యూపీఎల్ కేవలం మహిళా క్రికెటర్లకు మాత్రమే కాకుండా.. ఒక మహిళా పిచ్ క్యూరేటర్కు కూడా అవకాశాన్ని కల్పించింది.
Also Read
- AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
Also Read: Ranji Trophy 2024: 10, 11 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి.. సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు!
పిచ్ క్యూరేటర్గా బాధ్యతలు స్వీకరించిన జసింత కళ్యాణ్ను బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రత్యేకంగా అభినందించారు. భారత క్రికెట్ చరిత్రాత్మక పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. ‘జసింత కళ్యాణ్ భారత దేశపు తొలి మహిళా క్రికెట్ పిచ్ క్యూరేటర్గా అవతరించారు. బెంగుళూరులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంలో పిచ్ తయారీ బాధ్యతలు చేపట్టిన జసింత ఈ ఘనత సాధించడం ఆమె నిబద్ధత, ధైర్యానికి నిదర్శనం. జసింత పాత్ర ఆటకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. పిచ్ క్యూరేటర్ పాత్రలో ఆమె రావడం భారతదేశంలో క్రికెట్ అభివృద్ధి చెందుతున్న దృశ్యాన్ని ప్రతిబింబిస్తోంది. మైదానంలో అదరగొట్టే క్రీడాకారిణులను మాత్రమే కాకుండా.. ఆట కోసం తెరవెనుక అవిశ్రాంతమైన కృషి చేస్తున్న జసింత వంటి అసాధారణ వ్యక్తులను కూడా అభినందించడం అత్యవసరం’ అని జై షా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!