Virat Kohli-BCCI: అది హక్కు.. విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచిన బీసీసీఐ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jay Shah React on Virat Kohli Missed England Tests: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. కీలక టెస్ట్ సీరీస్, అందులోనూ సుదీర్ఘ సిరీస్ అయినా విరాట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. విరాట్ ఉన్నపళంగా ఇన్ని రోజులు జట్టుకు ఎందుకు దూరమయ్యాడు అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ఇంగ్లండ్ సిరీస్కు విరాట్ దూరం కావడాన్ని బీసీసీఐ సమర్థించింది. కోహ్లీ అకారణంగా సెలవులు తీసుకోడని అతడికి మద్దతుగా నిలిచింది.
బుధవారం రాజ్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం పేరును బీసీసీఐ మాజీ కార్యదర్శి ‘నిరంజన్ షా’ మైదానంగా మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జై షా.. విరాట్ కోహ్లీ సెలవులు తీసుకోవడంపై స్పందించాడు. ‘ఏ ఆటగాడు అయినా 15 ఏళ్ల కెరీర్లో వ్యక్తిగత సెలవు తీసుకోకపోతే వాటిని అడిగి వాడుకోవడం అతడి హక్కు. విరాట్ కోహ్లీ కారణం లేకుండా వ్యక్తిగత సెలవులు అస్సలు తీసుకోడు. అతడు ఆ రకం కాదు. మేం మా ఆటగాళ్లను నమ్ముతాం. అన్ని విధాలుగా వారికి అండగా ఉంటాం’ అని జై షా చెప్పాడు.
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
Also Read: Motorola G04 Launch: మోటోరోలా నుంచి మరో స్మార్ట్ఫోన్ వచ్చేసింది.. ధర 7 వేలు మాత్రమే!
రోహిత్ శర్మ వచ్చే టీ20 ప్రపంచకప్లో నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. దాంతో 2024 టీ20 ప్రపంచకప్లో రోహిత్ ఆడుతాడా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది. అయితే విరాట్ కోహ్లీ పొట్టి టోర్నీలో ఉంటాడా? అనే విషయాన్ని మాత్రం జై షా చెప్పలేదు. విరాట్ గురించి అడగ్గా.. అతడి గురించి తర్వాత మాట్లాడుకుందాం అని సమాధానం చెప్పకుండా దాటవేశాడు. అయితే ఫుల్ ఫామ్ మీదున్న కోహ్లీ టీ20 ప్రపంచకప్లో కచ్చితంగా ఆడనున్నాడు. ఈ కార్యక్రమంలో జై షాతో పాటుగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాగొన్నారు.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..