RG Kar Hospital: కోల్కతా ఆర్జి కర్ ఆసుపత్రిపై మరో ఆరోపణ..వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు బలి?
- కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిపై మరో ఆరోపణ
- వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు బలి?
- స్పందించిన ఆస్పత్రి బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య తర్వాత వెలుగులోకి వచ్చిన కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మరోసారి కలకలం రేగింది. ఈసారి ఓ యువకుడికి వైద్యం అందించడంలో ఆస్పత్రుల వైద్యులు జాప్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి.. హుగ్లీ జిల్లాలోని కొన్నాగర్కు చెందిన 28 ఏళ్ల యువకుడు బిక్రమ్ భట్టాచాజీని శుక్రవారం మధ్యాహ్నం ట్రక్కు ఢీకొంది. వెంటనే అతడిని ఆర్జీకర్ మెడికల్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ యువకుడు మృతి చెందాడు. ఎమర్జెన్సీలో వైద్యులు లేరని, అందుకే చికిత్స ఆలస్యమైనందుకే యువకుడు చనిపోయాడని బిక్రమ్ తల్లి కబిత ఆరోపించారు. వైద్యులు వచ్చేందకు చాలా సమయం పట్టిందని.. ఆ లోపు అతడి సర్జరీ పూర్తయ్యేదని బాధితులు రాపోయారు. అత్యవసర వైద్యుడు కూడా లేరని ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బిక్రమ్ను ఆర్జీ కర్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
READ MORE: Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో ఇండియా ‘C’ ఘన విజయం..
Also Read
ఈ విషయంపై ఆస్పత్రి వైద్యలు స్పందించారు. బిక్రమ్ను ఆర్జి కర్ వద్దకు తీసుకువచ్చిన వెంటనే ట్రామా కేర్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. అతని శరీరంలోని రెండు భాగాలపై తీవ్ర గాయాలయ్యాయని… అంతే కాకుండా తలపై కూడా బలమైన గాయం ఉన్నట్లు గుర్తించామన్నారు. సీటీ స్కాన్ కోసం తరలించామన్నారు. సీటీ స్కాన్ తీసేటప్పుడు రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి మరణించాడని స్పష్టం చేశారు.
READ MORE:Actor Darshan: జైల్లో టీవీ కోసం రిక్వెస్ట్.. అంగీకరించిన అధికారులు
ఈ ఘటనపై తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్నార్కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అతను 3 గంటల పాటు ఎటువంటి చికిత్స లేకుండా ఉండవలసి వచ్చింది. ఈ సమయంలో రక్తస్రావం ఎక్కువగా జరిగింది. ఆర్జీ ఘటనపై స్పందించిన వైద్యుల నిరసన ఫలితం ఇది. జూనియర్ వైద్యుల డిమాండ్లు న్యాయమైనవి. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరసనలు తెలపాలని వారిని కోరుతున్నాను. నివారించదగిన నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మరణిస్తే అది నేరపూరిత హత్యతో సమానం. నిరసనలు కొనసాగాలంటే, నిర్మాణాత్మకంగా, తాదాత్మ్యంతో, మానవత్వంతో, నిష్క్రియాత్మకత లేదా ఉదాసీనత వల్ల ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా చూసుకోవాలి.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!