Bengaluru Water Crisis: బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నీటి కష్టాలు.. నీటి క్యాన్లతో ఆర్ఓ కేంద్రాల వద్ద క్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Water Crisis: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఏర్పడిన తాగు నీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేతిలో పట్టుకుని గంటల తరబడి ఆర్ఓ కేంద్రాల దగ్గర వేచి ఉంటున్నారు. ఆఫీసులకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పాడిందని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. నీటి కష్టాలపై ఐటీ నిపుణులు తమ బాధలు, ఇబ్బందులను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు వివిధ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానానికి అనిమతి ఇచ్చాయి. దీంతో కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి తమ సొంత ఊర్లకు పయణం అవుతున్నారు.
Read Also: Telepathically -Elon Musk: మెదడులోని చిప్ సాయంతో చెస్ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
అయితే, నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి బెంగళూరు నగరంలో నెలకొంది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలను వెదుకుతున్నారు. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉదయాన్నే మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సర్వ సాధారణమై పోయాయి. అనేక అపార్ట్మెంట్లలో నీటి రేషన్ వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చారు. నీటిని నిర్ణయించిన స్థాయిలోనే ఉపయోగించాలి.. ఎక్కువగా వాడితే జరిమానా వేస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 రూపాయల వరకు నీటికే వెచ్చించక తప్పడం లేదు అని వారు వాపోతున్నారు.
Read Also: The Goat Life : సెన్సార్ పూర్తి చేసుకున్న “ది గోట్ లైఫ్”మూవీ.. రన్ టైం ఎంతంటే..?
ఇక, రాజధాని నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తిగా ‘ట్యాంకర్ మాఫీయా’కు లొంగిపోయారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గడువు పూర్తైన ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేక అధిక రేట్లు వసూలు చేస్తున్నారని విపక్ష పార్టీలు అంటున్నారు. ప్రైవేట్ సంస్థల సహకారంతో వార్డుకు ఒకటి చొప్పున సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ప్రజా సమస్యలకు స్పందించాలని విపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!