Bengaluru Water Crisis: బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నీటి కష్టాలు.. నీటి క్యాన్లతో ఆర్ఓ కేంద్రాల వద్ద క్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Water Crisis: కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఏర్పడిన తాగు నీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేతిలో పట్టుకుని గంటల తరబడి ఆర్ఓ కేంద్రాల దగ్గర వేచి ఉంటున్నారు. ఆఫీసులకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పాడిందని ఐటీ ఉద్యోగులు అంటున్నారు. నీటి కష్టాలపై ఐటీ నిపుణులు తమ బాధలు, ఇబ్బందులను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. కొన్ని వారాల పాటు వివిధ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానానికి అనిమతి ఇచ్చాయి. దీంతో కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి తమ సొంత ఊర్లకు పయణం అవుతున్నారు.
Read Also: Telepathically -Elon Musk: మెదడులోని చిప్ సాయంతో చెస్ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
అయితే, నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి బెంగళూరు నగరంలో నెలకొంది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలను వెదుకుతున్నారు. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉదయాన్నే మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సర్వ సాధారణమై పోయాయి. అనేక అపార్ట్మెంట్లలో నీటి రేషన్ వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చారు. నీటిని నిర్ణయించిన స్థాయిలోనే ఉపయోగించాలి.. ఎక్కువగా వాడితే జరిమానా వేస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 రూపాయల వరకు నీటికే వెచ్చించక తప్పడం లేదు అని వారు వాపోతున్నారు.
Read Also: The Goat Life : సెన్సార్ పూర్తి చేసుకున్న “ది గోట్ లైఫ్”మూవీ.. రన్ టైం ఎంతంటే..?
ఇక, రాజధాని నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తిగా ‘ట్యాంకర్ మాఫీయా’కు లొంగిపోయారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. గడువు పూర్తైన ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేక అధిక రేట్లు వసూలు చేస్తున్నారని విపక్ష పార్టీలు అంటున్నారు. ప్రైవేట్ సంస్థల సహకారంతో వార్డుకు ఒకటి చొప్పున సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ప్రజా సమస్యలకు స్పందించాలని విపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!