Israel Hamas War: గాజా స్వాధీనానికి బయలు దేరిన ఇజ్రాయెల్.. గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Hamas War: ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు గాజా స్ట్రిప్లో గ్రౌండ్ ఆపరేషన్లు నిర్వహించడానికి సిద్ధమైంది. గాజాను స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ పూర్తి సన్నాహాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లక్షలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ట్యాంకులు, డ్రోన్లు, మారణాయుధాలతో సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు హమాస్ రాజకీయ, సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తోంది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమికొట్టాలని చూస్తున్నట్లు.. అందుకు తగిన చర్చ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 2006 తర్వాత ఇజ్రాయెల్లో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అవుతుందని భావిస్తున్నారు.
Read Also:CM YS Jagan: అప్పుడే విశాఖకు.. షిఫ్టింగ్పై సీఎం జగన్ క్లారిటీ
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశిస్తే.. నెలల తరబడి ఇక్కడ రక్తపు ఆట కొనసాగుతుంది. ఇజ్రాయెల్ బందీలను హమాస్ చంపుతోందని ఆ దేశం ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ మొదట గాజాలోని పట్టణ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటుందని.. హమాస్ను నిర్మూలించనుందని చెబుతున్నారు. అదే సమయంలో హిజ్బుల్లా కూడా హమాస్కు మద్దతు ఇస్తుందని.. ఇజ్రాయెల్పై పోరాడుతుందని చెప్పారు. హిజ్బుల్లా కూడా ఈ యుద్ధంలో చేరితే యుద్ధం మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికే శుక్రవారం గాజా సరిహద్దులోకి ప్రవేశించారు. భారీ ఆపరేషన్ కోసం సిద్ధమవుతున్నారు. హమాస్ యోధులు కూడా బంకర్లు, సొరంగాలలోకి ప్రవేశించడం ద్వారా సన్నాహాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ శనివారం లేదా ఆదివారం పూర్తి శక్తితో గాజాపై దాడి చేయాలని ప్లాన్ చేసింది.
Read Also:Sudan: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. వెలుగులోకి మరో దేశంలోని దిగ్భ్రాంతికర విషయాలు
వాతావరణం అనుకూలించ లేదు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఇజ్రాయెల్ సైన్యానికి వైమానిక మద్దతు లభించలేదు. హెలికాప్టర్లు, జెట్లు, డ్రోన్ల ఆపరేషన్ కష్టంగా మారింది. భూమిపై నుంచి దాడి జరిగితే ఎయిర్ కవర్ కూడా ఉండాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఇజ్రాయెల్ కూడా గాజాపై గాలి, భూమి, నీరు మూడు వైపుల నుండి దాడి చేయాలనుకుంటోంది. యుద్ధం ఈ స్థాయికి చేరితే చాలా మంది అమాయకులు చనిపోతారని పాలస్తీనియన్లు అంటున్నారు. సాధారణ పౌరులను దీనికి దూరంగా ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దక్షిణ గాజాను స్వాధీనం చేసుకోవాలా వద్దా అనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ఇప్పటివరకు బందీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!