Sudan: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం.. వెలుగులోకి మరో దేశంలోని దిగ్భ్రాంతికర విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ముస్లిం దేశం సూడాన్ నుండి ఓ భయానక నివేదిక వెలువడింది. సూడాన్లో అత్యాచారం, లైంగిక హింస కేసులు విపరీతంగా పెరిగాయి. ఆందోళనకరమైన గణాంకాలు అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. ఇది ఇలా ఉంటే ఏప్రిల్ నుండి అత్యాచారంతో సహా సంఘర్షణ- లైంగిక హింసకు సంబంధించిన 21 సంఘటనల గురించి విశ్వసనీయ నివేదికలు వస్తున్నాయి. ఈ సంఘటనల్లో 10 మంది మైనర్లతో సహా 57 మంది మహిళలు, బాలికలను బాధితులు అయ్యారు. ఈ క్రూరమైన నేరాలకు ప్రధాన నిందితులు సూడాన్లో పనిచేస్తున్న పారామిలిటరీ దళం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) యోధులుగా గుర్తించారు.
Read Also:IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. రియల్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ‘బాస్’ హీరోయిన్!
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
మహిళలు, బాలికలు యుద్ధం మధ్య సురక్షితమైన ప్రదేశాలను వెతుకుతున్నందున లైంగిక హింసకు గురయ్యారు. ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ప్రజలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సూడాన్లో అత్యాచారం, లైంగిక హింస స్థాయిపై అంచనా వేయలేం. ఈ యుద్ధం అస్థిరత, అరాచక వాతావరణాన్ని సృష్టించింది, ఇది అటువంటి క్రూరమైన నేరాల పెరుగుదలను చూసింది. వలసలు, సాయుధ సమూహాలు, సామాజిక నిర్మాణాల విచ్ఛిన్నం మహిళలు, బాలికలకు సమస్యలను తెచ్చిపెట్టాయి.
Read Also: Traders Protest on Basmati: మూతపడిన బియ్యం మార్కెట్లు.. నిలిచిపోయిన కొనుగోళ్లు
ఈ పోరాటం మొదట్లో ఖార్టూమ్లో జరిగింది. కానీ త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. పశ్చిమ డార్ఫర్ ప్రాంతంతో సహా ఈ పోరాటంలో 9,000 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ అధిపతి మార్టిన్ గ్రిఫిత్స్ తెలిపారు. ప్రజలు సూడాన్ లోపల లేదా పొరుగు దేశాలలో ఆశ్రయం పొందారు. సూడాన్ లోపల 4.5 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే 1.2 మిలియన్లకు పైగా పొరుగు దేశాలలో ఆశ్రయం పొందారు. గ్రిఫిత్స్ పోరాటంలో 25 మిలియన్ల మంది ప్రజలు అంటే దేశ జనాభాలో సగానికి పైగా మానవతా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!