Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel India 1980s Offer To Strike Pakistan Nuclear Site

Israel Offer: ఇజ్రాయెల్ ఆఫర్‌కు భారత్ ఓకే చెప్తే.. పాక్ కథ ఎప్పుడో ముగిసేది!

Published Date :September 15, 2025 , 6:19 pm
By Shiva Ganesh
Israel Offer: ఇజ్రాయెల్ ఆఫర్‌కు భారత్ ఓకే చెప్తే.. పాక్ కథ ఎప్పుడో ముగిసేది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel Offer: నాలుగు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్‌కు ఇండియా ఓకే చెప్తే.. ఇప్పుడు పాకిస్థాన్ అచ్చంగా కోరలు పీకేసిన పాములాగా మారేది. ఇది నిజం.. ఆ సమయంలో భారతదేశం – పాకిస్థాన్ మధ్య అప్పటికే మూడు యుద్ధాలు జరిగాయి. అదే సమయంలో పాకిస్థాన్ అణ్వస్త్ర శక్తిని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ విషయం భారత్‌తో పాటు ఇజ్రాయెల్‌కు కూడా తెలుసు. అప్పుడే ఇజ్రాయెల్.. ఇండియాకు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌కు ముందు భారత్ ఒప్పుకుంది.. కానీ.. ఆ కానీ కారణంగానే నేడు పాక్ బతకడంతో పాటు ఉగ్రముకలకు నిలయంగా మారింది..

READ ALSO: వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!

ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడిన పాకిస్థాన్‌కు ఇజ్రాయెల్ సమాధానం చెప్పిన విధానం 1980ల కథను మరోసారి గుర్తుకు తెచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందంటే.. ఇజ్రాయెల్ భారతదేశానికి కావాలంటే పాకిస్థాన్‌పై బాంబులు వేసి దాని కథను ముగించవచ్చని ఆఫర్ చేసింది. అప్పుడు దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఇందిరా గాంధీ ప్రభుత్వం ముందు ఈ ఆఫర్‌కు చాలా వరకు ఓకే చెప్పేలా కనిపించింది. కానీ చివరి క్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోవడంతో పాక్ నేడు బుసలు కొట్టగలుగుతుంది.

‘డిసెప్షన్‌’లో నాటి కథ..
ఆడ్రియన్ లెవీ, కేథరీన్ స్కాట్ క్లార్క్ రాసిన డిసెప్షన్ అనే పుస్తకంలో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఈ కథ గురించి ప్రస్తావించారు. 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్.. పాకిస్థాన్ అణు కార్యక్రమాన్ని ముప్పుగా చూసింది. ఇరాన్‌ కూడా ఆ రోజుల్లో అణు కార్యక్రమం ప్రారంభిస్తే దానిపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిది. అటువంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి.. 1984లో పాక్‌స్థాన్‌పై దాడికి భారతదేశానికి జాయింట్ ఆపరేషన్‌ను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ F-16, F-15 యుద్ధ విమానాలు భారతదేశంలోని జామ్‌నగర్ వైమానిక స్థావరం నుంచి ఇంధనం నింపిన తర్వాత పాకిస్థాన్‌లోని కహుతా అణు కేంద్రంపై బాంబు దాడి చేసి దానిని నాశనం చేయాలనేది ప్లాన్. ఇజ్రాయెల్ విమానాలకు భారత జాగ్వార్ విమానాలు సహాయం చేయాలి.

అంగీకరించినట్లే ఉండి.. తర్వాత
అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ ప్లాన్‌కు ముందుగా అంగీకరించారు. కానీ తరువాత అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా, ముఖ్యంగా అమెరికా, పాకిస్థాన్‌తో నాల్గవ యుద్ధం భయం కారణంగా వెనక్కి తగ్గారు. 1981లో ఇరాక్‌లోని ఒసిరాక్ అణు రియాక్టర్‌పై దాడి చేసిన విధంగానే పాకిస్థాన్‌పై కూడా దాడి చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంది. ఆదే సమయంలో ఇందిరా గాంధీ హత్యకు గురై, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఈ ప్లాన్ పూర్తిగా ఆపేశారు.

పాక్‌పై ఇజ్రాయెల్ విమర్శలు కొత్త కాదు..
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న అంశాన్ని ఇజ్రాయెల్ లేవనెత్తడం ఇదే మొదటిసారి కాదు. పాక్ నియంత జియా-ఉల్-హక్ నాయకత్వంలో ఆ దేశం అణు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ అనేకసార్లు హెచ్చరించింది. 1979లో దీని గురించి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు కూడా ఒక లేఖ రాసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ భారతదేశానికి పాక్‌పై దాడికి ప్రతిపాదన చేసింది. కానీ భారతదేశంలోని అంతర్గత అశాంతి కారణంగా నాటి ప్రభుత్వం యుద్ధం కోరుకోలేదు. దీనితో పాటు పాకిస్థాన్‌కు అమెరికా నుంచి మద్దతు లభించడం, అగ్రరాజ్యం పాక్‌కు F-16 విమానాలను ఇవ్వడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ ఆఫర్ నుంచి వెనక్కి తగ్గడం మంచిదని భారతదేశం భావించింది.

READ ALSO: How To Recover Money From Friends: దోస్తులు తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదా… అయితే వీటిని ట్రై చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deception book Pakistan
  • India Pakistan nuclear tension
  • Indira Gandhi Israel offer
  • Israel attack offer Pakistan
  • Israel F-16 Kahuta

తాజావార్తలు

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు

  • Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

  • COP33 Climate Summit 2028: COP33 వాతావరణ సదస్సు.. ఆతిథ్యం ప్రతిపాదనను ఉపసంహరించుకున్న భారత్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions