Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel India 1980s Offer To Strike Pakistan Nuclear Site

Israel Offer: ఇజ్రాయెల్ ఆఫర్‌కు భారత్ ఓకే చెప్తే.. పాక్ కథ ఎప్పుడో ముగిసేది!

Published Date :September 15, 2025 , 6:19 pm
By Shiva Ganesh
Israel Offer: ఇజ్రాయెల్ ఆఫర్‌కు భారత్ ఓకే చెప్తే.. పాక్ కథ ఎప్పుడో ముగిసేది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Israel Offer: నాలుగు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్‌కు ఇండియా ఓకే చెప్తే.. ఇప్పుడు పాకిస్థాన్ అచ్చంగా కోరలు పీకేసిన పాములాగా మారేది. ఇది నిజం.. ఆ సమయంలో భారతదేశం – పాకిస్థాన్ మధ్య అప్పటికే మూడు యుద్ధాలు జరిగాయి. అదే సమయంలో పాకిస్థాన్ అణ్వస్త్ర శక్తిని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ విషయం భారత్‌తో పాటు ఇజ్రాయెల్‌కు కూడా తెలుసు. అప్పుడే ఇజ్రాయెల్.. ఇండియాకు ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌కు ముందు భారత్ ఒప్పుకుంది.. కానీ.. ఆ కానీ కారణంగానే నేడు పాక్ బతకడంతో పాటు ఉగ్రముకలకు నిలయంగా మారింది..

READ ALSO: వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!

ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మాట్లాడిన పాకిస్థాన్‌కు ఇజ్రాయెల్ సమాధానం చెప్పిన విధానం 1980ల కథను మరోసారి గుర్తుకు తెచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందంటే.. ఇజ్రాయెల్ భారతదేశానికి కావాలంటే పాకిస్థాన్‌పై బాంబులు వేసి దాని కథను ముగించవచ్చని ఆఫర్ చేసింది. అప్పుడు దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఇందిరా గాంధీ ప్రభుత్వం ముందు ఈ ఆఫర్‌కు చాలా వరకు ఓకే చెప్పేలా కనిపించింది. కానీ చివరి క్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోవడంతో పాక్ నేడు బుసలు కొట్టగలుగుతుంది.

‘డిసెప్షన్‌’లో నాటి కథ..
ఆడ్రియన్ లెవీ, కేథరీన్ స్కాట్ క్లార్క్ రాసిన డిసెప్షన్ అనే పుస్తకంలో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఈ కథ గురించి ప్రస్తావించారు. 1980ల ప్రారంభంలో ఇజ్రాయెల్.. పాకిస్థాన్ అణు కార్యక్రమాన్ని ముప్పుగా చూసింది. ఇరాన్‌ కూడా ఆ రోజుల్లో అణు కార్యక్రమం ప్రారంభిస్తే దానిపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించిది. అటువంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి.. 1984లో పాక్‌స్థాన్‌పై దాడికి భారతదేశానికి జాయింట్ ఆపరేషన్‌ను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ F-16, F-15 యుద్ధ విమానాలు భారతదేశంలోని జామ్‌నగర్ వైమానిక స్థావరం నుంచి ఇంధనం నింపిన తర్వాత పాకిస్థాన్‌లోని కహుతా అణు కేంద్రంపై బాంబు దాడి చేసి దానిని నాశనం చేయాలనేది ప్లాన్. ఇజ్రాయెల్ విమానాలకు భారత జాగ్వార్ విమానాలు సహాయం చేయాలి.

అంగీకరించినట్లే ఉండి.. తర్వాత
అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ ప్లాన్‌కు ముందుగా అంగీకరించారు. కానీ తరువాత అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా, ముఖ్యంగా అమెరికా, పాకిస్థాన్‌తో నాల్గవ యుద్ధం భయం కారణంగా వెనక్కి తగ్గారు. 1981లో ఇరాక్‌లోని ఒసిరాక్ అణు రియాక్టర్‌పై దాడి చేసిన విధంగానే పాకిస్థాన్‌పై కూడా దాడి చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంది. ఆదే సమయంలో ఇందిరా గాంధీ హత్యకు గురై, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఈ ప్లాన్ పూర్తిగా ఆపేశారు.

పాక్‌పై ఇజ్రాయెల్ విమర్శలు కొత్త కాదు..
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న అంశాన్ని ఇజ్రాయెల్ లేవనెత్తడం ఇదే మొదటిసారి కాదు. పాక్ నియంత జియా-ఉల్-హక్ నాయకత్వంలో ఆ దేశం అణు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ అనేకసార్లు హెచ్చరించింది. 1979లో దీని గురించి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు కూడా ఒక లేఖ రాసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ భారతదేశానికి పాక్‌పై దాడికి ప్రతిపాదన చేసింది. కానీ భారతదేశంలోని అంతర్గత అశాంతి కారణంగా నాటి ప్రభుత్వం యుద్ధం కోరుకోలేదు. దీనితో పాటు పాకిస్థాన్‌కు అమెరికా నుంచి మద్దతు లభించడం, అగ్రరాజ్యం పాక్‌కు F-16 విమానాలను ఇవ్వడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇజ్రాయెల్ ఆఫర్ నుంచి వెనక్కి తగ్గడం మంచిదని భారతదేశం భావించింది.

READ ALSO: How To Recover Money From Friends: దోస్తులు తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదా… అయితే వీటిని ట్రై చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deception book Pakistan
  • India Pakistan nuclear tension
  • Indira Gandhi Israel offer
  • Israel attack offer Pakistan
  • Israel F-16 Kahuta

తాజావార్తలు

  • Perfect Roti Dough Ratio: రొట్టె పిండిని ఎలా కలపాలి.. ఎంత నీరు వాడాలి.. ? 99 శాతం మందికి తెలియని విషయం ఇది..!

  • Kuppam Murder Case: ఒక్క ఫోన్ కాల్.. తోటలో శవంగా యువకుడు! కుప్పంలో కలకలం..

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Chiranjeevi: చిరంజీవి కూతురుగా ఆ హీరోయిన్‌?

  • Supreme Court: చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ట్రెండింగ్‌

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions