Israel Hamas War: ఒక వైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు.. మరోవైపు గాజాలో 15 మంది హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాశ్వత కాల్పుల విరమణ కోసం హమాస్ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సమయంలో గాజాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్లో అత్యంత భీకర పోరు కొనసాగుతోంది. హమాస్ కమాండర్లు ఇక్కడి సొరంగాల్లో దాక్కున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ భయపడుతోంది. దీంతో ఆ సొరంగాల్లోకి నీటిని పోసి వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Read Also: Vijay Deverakonda: అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫస్ట్ రివ్యూ..అద్భుతం అంటున్న దేవరకొండ
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ఇక, ఉత్తర గాజాలోని పాఠశాలలో దాక్కున్న 15 మంది హమాస్ ఉగ్రవాదులను మంగళవారం నాడు హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 150 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా.. 313 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, తాజా మరణాలతో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 26 వేల 900కి చేరుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.
Read Also: Budget 2024 : బడ్జెట్లో మధ్య తరగతికి గండికొడతారా.. రైతుల ఆశలు నెరవేరుతాయా ?
అలాగే, గాజా నగరంలోని షాతీ శరణార్థి శిబిరం శివార్లలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక సైన్యం దాడులు చేశాయి. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నాటికి గాజాలో 2.3 మిలియన్ల జనాభా ఉండగా అందులో ప్రస్తుతం 85 శాతం మంది నిరాశ్రయులయ్యారు. మిగతా వారు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!