Israel-Hamas War: యుద్ధంలో చిక్కుకున్న భారత విద్యార్థులు.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్లో ఉన్నారు. సమాచారం ప్రకారం.. 18 వేల మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిని భారత ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. శనివారం రాత్రి మాకు చాలా సందేశాలు వచ్చాయి.మేము రాత్రంతా పని చేస్తున్నాము. ప్రధాన మంత్రి కార్యాలయం పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోందని ఆమె వెల్లడించారు. ప్రధాని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు.
Also Read: Air India: అక్టోబర్ 14 వరకు ఇజ్రాయెల్కు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
భారత రాయబార కార్యాలయం తన పౌరులందరినీ అప్రమత్తంగా ఉండాలని సూచించిందని అందరికీ తెలిసిన విషయమే. భారత విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు విద్యార్థులను సమీపంలోని షెల్టర్లకు తరలించారు. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థి గోకుల్ మనవలన్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘నేను చాలా భయాందోళనలకు గురవుతున్నాను. ఇజ్రాయెల్ పోలీసు బలగాలు మాకు అండగా ఉన్నాయి. ఇప్పటివరకు మేము సురక్షితంగా ఉన్నాము. మేము భారతీయ రాయబార కార్యాలయం నుంచి వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నాము.’ అని తెలిపారు.
Also Read: Israel-Hamas: ఇజ్రాయిల్పై దాడి… కెనడా, యూకేలో సంబరాలు..
ఉగ్రవాదుల దాడిలో 300 మందికి పైగా మరణించారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, హమాస్ మిలిటెంట్లు అనేక నగరాలపై దాడి చేస్తున్నారు. గాజాలో 400 మందికి పైగా మిలిటెంట్లు చంపబడ్డారు, డజన్ల కొద్దీ పట్టుబడ్డారు. అదే సమయంలో, గాజాలో ఇప్పటివరకు దాదాపు 313 మంది మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం ఎనిమిది ప్రాంతాల్లో హమాస్తో వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడిని యుద్ధంగా అభివర్ణించారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, దానికి వారు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని వెల్లడించారు. శనివారం ఉదయం జరిగిన ఆకస్మిక దాడి తర్వాత పాలస్తీనా మిలిటెంట్లు చొరబడిన ఎనిమిది ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం హమాస్పై పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడిని అమెరికా, జపాన్ సహా పలు దేశాలు ఖండించి ఇజ్రాయెల్ పట్ల తమ సానుభూతిని వ్యక్తం చేశాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!