Israel-Hamas War: యుద్ధంలో చిక్కుకున్న భారత విద్యార్థులు.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లతో దాడి చేశారు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రతీకార చర్య కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్లో ఉన్నారు. సమాచారం ప్రకారం.. 18 వేల మంది భారతీయ పౌరులు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిని భారత ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. శనివారం రాత్రి మాకు చాలా సందేశాలు వచ్చాయి.మేము రాత్రంతా పని చేస్తున్నాము. ప్రధాన మంత్రి కార్యాలయం పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోందని ఆమె వెల్లడించారు. ప్రధాని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆమె తెలిపారు.
Also Read: Air India: అక్టోబర్ 14 వరకు ఇజ్రాయెల్కు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
భారత రాయబార కార్యాలయం తన పౌరులందరినీ అప్రమత్తంగా ఉండాలని సూచించిందని అందరికీ తెలిసిన విషయమే. భారత విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు విద్యార్థులను సమీపంలోని షెల్టర్లకు తరలించారు. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థి గోకుల్ మనవలన్ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘నేను చాలా భయాందోళనలకు గురవుతున్నాను. ఇజ్రాయెల్ పోలీసు బలగాలు మాకు అండగా ఉన్నాయి. ఇప్పటివరకు మేము సురక్షితంగా ఉన్నాము. మేము భారతీయ రాయబార కార్యాలయం నుంచి వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నాము.’ అని తెలిపారు.
Also Read: Israel-Hamas: ఇజ్రాయిల్పై దాడి… కెనడా, యూకేలో సంబరాలు..
ఉగ్రవాదుల దాడిలో 300 మందికి పైగా మరణించారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, హమాస్ మిలిటెంట్లు అనేక నగరాలపై దాడి చేస్తున్నారు. గాజాలో 400 మందికి పైగా మిలిటెంట్లు చంపబడ్డారు, డజన్ల కొద్దీ పట్టుబడ్డారు. అదే సమయంలో, గాజాలో ఇప్పటివరకు దాదాపు 313 మంది మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం ఎనిమిది ప్రాంతాల్లో హమాస్తో వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దాడిని యుద్ధంగా అభివర్ణించారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, దానికి వారు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని వెల్లడించారు. శనివారం ఉదయం జరిగిన ఆకస్మిక దాడి తర్వాత పాలస్తీనా మిలిటెంట్లు చొరబడిన ఎనిమిది ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం హమాస్పై పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడిని అమెరికా, జపాన్ సహా పలు దేశాలు ఖండించి ఇజ్రాయెల్ పట్ల తమ సానుభూతిని వ్యక్తం చేశాయి.
తాజావార్తలు
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!