R Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్కు ఆ ఇద్దరే కారణమా?
- క్రికెట్కు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు
- సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ఎందుకు
- రిటైర్మెంట్కు ఆ ఇద్దరే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బుధవారం ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే మీడియా ముందుకు వచ్చి అశ్విన్.. తాను క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులు ఉన్నా.. యాష్ అనుహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడానికి ఆ ఇద్దరే కారణమని చెప్పొచ్చు.
సిరీస్ మధ్యలోనే ఆర్ అశ్విన్ రిటైర్ కావడానికి మొదటి కారణం సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా అని చెప్పొచ్చు. బ్రిస్బేన్ టెస్టులో జడేజా వలనే టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. 77 పరుగుల కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్న జడేజాను మెల్బోర్న్, సిడ్నీలో జరిగే టెస్టుల్లో పక్కనపెట్టే అవకాశం లేదు. మరోవైపు మెల్బోర్న్, సిడ్నీ పిచ్లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే అంచనాలున్నాయి కాబట్టి.. రెండో స్పిన్నర్గా బ్యాటింగ్ చేసే వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో చివరి రెండు మ్యాచ్ల్లో చోటు దక్కడం కష్టమని బావించిన అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించి ఉంటాడని విశ్లేషకులు బావిస్తున్నారు.
Also Read
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
- Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్గా రాణించాడు. దాంతో ఆస్ట్రేలియా టూర్కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. ఆర్ అశ్విన్తో పోలిస్తే సుందర్ బాగా బ్యాటింగ్ చేయగలడు. యాష్ కెరీర్ చరమాంకంలో ఉండడంతో.. టీమిండియా భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సుందర్కు అవకాశాలు ఇస్తోంది. యాష్ స్థానాన్ని సుందర్తో భర్తీ చేయాలనేది బీసీసీఐ ఆలోచన. ఇప్పటికే వన్డే, టీ20ల తుది జట్టులో యాష్ ఉండడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు ఇప్పట్లో భారత జట్టుకు టెస్టు సిరీస్లు లేవు. ఇవన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అశ్విన్ భారత్ తరఫున 106 టెస్టుల్లో 537, 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్ట్ ఫార్మాట్లో 3503 పరుగులు చేసిన యాష్.. 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు బాదాడు.
తాజావార్తలు
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
-
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!