Iran Fire: హర్మూజ్ దాటే నౌకలపై ఇరాన్ కాల్పులు.. భారత్ వచ్చే రెండు నౌకలు దారి మళ్లింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం ‘హర్మూజ్ జలసంధి’. ఇక్కడ తాజాగా ఇరాన్ గన్బోట్లు ఒక వ్యాపార నౌక (ట్యాంకర్)పై కాల్పులు జరపడం కలకలం రేపింది. సముద్ర ప్రయాణాలపై ఇరాన్ ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రశాంతంగా సాగే సరుకు రవాణా నౌకలపై ఇలాంటి దాడులు జరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
అసలు ఏం జరిగింది?
అంతర్జాతీయ వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్ను ఇరాన్కు చెందిన గన్బోట్లు అడ్డుకున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఆ సముద్ర మార్గంలో కొత్త నిబంధనలు విధించింది. తమ అనుమతి లేకుండా లేదా తమ జలాల్లోకి ప్రవేశించిన నౌకలపై చర్యలు తీసుకుంటామని గతంలోనే హెచ్చరించింది. సదరు నౌక ఇరాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు సాగడంతో, ఇరాన్ దళాలు గన్బోట్ల నుంచి కాల్పులు జరిపారు. నౌక నుంచి అందిన ప్రమాద సంకేతాల (Distress Signals) ఆధారంగా సమీపంలో ఉన్న అంతర్జాతీయ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే.. ఈ కాల్పుల వల్ల నౌకలోని సిబ్బందికి గానీ, నౌకకు గానీ ఎంత మేరకు నష్టం జరిగిందనే దానిపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.
Also Read
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
Also Read:Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..
ప్రపంచ దేశాల స్పందన..
ఈ ఘటనపై అమెరికా , ఇతర పాశ్చాత్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇరాన్ చర్యను ‘బలవంతపు చర్య’గా అభివర్ణించాయి. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని, ఇలాంటి కాల్పుల వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలుగుతుందని ఆరోపిస్తున్నాయి.
హర్మూజ్ జలసంధి నుంచి ప్రపంచానికి అవసరమయ్యే చమురులో దాదాపు 20 శాతం రవాణా అవుతుంది. ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్తత తలెత్తినా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు అమెరికా తన యుద్ధ నౌకలను అప్రమత్తం చేసింది. ఇరాన్ తన ఆంక్షలను కఠినతరం చేయాలని చూస్తుండటం, అమెరికా దానిని అడ్డుకోవడం మధ్య ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే ఇలాంటి వార్తలు రావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి నుంచి ఇండియాకు రావాల్సిన రెండు నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు ట్యాంకర్ ట్రాకర్ వెల్లడించింది. ఇది అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి, సముద్ర మార్గాల్లో ప్రయాణించే ట్యాంకర్ల యాజమాన్యాలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నౌకాదళ సంస్థలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?