Iran Fire: హర్మూజ్ దాటే నౌకలపై ఇరాన్ కాల్పులు.. భారత్ వచ్చే రెండు నౌకలు దారి మళ్లింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం ‘హర్మూజ్ జలసంధి’. ఇక్కడ తాజాగా ఇరాన్ గన్బోట్లు ఒక వ్యాపార నౌక (ట్యాంకర్)పై కాల్పులు జరపడం కలకలం రేపింది. సముద్ర ప్రయాణాలపై ఇరాన్ ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాల మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రశాంతంగా సాగే సరుకు రవాణా నౌకలపై ఇలాంటి దాడులు జరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.
అసలు ఏం జరిగింది?
అంతర్జాతీయ వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్ను ఇరాన్కు చెందిన గన్బోట్లు అడ్డుకున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఆ సముద్ర మార్గంలో కొత్త నిబంధనలు విధించింది. తమ అనుమతి లేకుండా లేదా తమ జలాల్లోకి ప్రవేశించిన నౌకలపై చర్యలు తీసుకుంటామని గతంలోనే హెచ్చరించింది. సదరు నౌక ఇరాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ముందుకు సాగడంతో, ఇరాన్ దళాలు గన్బోట్ల నుంచి కాల్పులు జరిపారు. నౌక నుంచి అందిన ప్రమాద సంకేతాల (Distress Signals) ఆధారంగా సమీపంలో ఉన్న అంతర్జాతీయ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అయితే.. ఈ కాల్పుల వల్ల నౌకలోని సిబ్బందికి గానీ, నౌకకు గానీ ఎంత మేరకు నష్టం జరిగిందనే దానిపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది.
Also Read
- Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
- Barley Upma Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
- Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
Also Read:Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..
ప్రపంచ దేశాల స్పందన..
ఈ ఘటనపై అమెరికా , ఇతర పాశ్చాత్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇరాన్ చర్యను ‘బలవంతపు చర్య’గా అభివర్ణించాయి. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని, ఇలాంటి కాల్పుల వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలుగుతుందని ఆరోపిస్తున్నాయి.
హర్మూజ్ జలసంధి నుంచి ప్రపంచానికి అవసరమయ్యే చమురులో దాదాపు 20 శాతం రవాణా అవుతుంది. ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్తత తలెత్తినా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు అమెరికా తన యుద్ధ నౌకలను అప్రమత్తం చేసింది. ఇరాన్ తన ఆంక్షలను కఠినతరం చేయాలని చూస్తుండటం, అమెరికా దానిని అడ్డుకోవడం మధ్య ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే ఇలాంటి వార్తలు రావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి నుంచి ఇండియాకు రావాల్సిన రెండు నౌకలు తమ మార్గాన్ని మార్చుకున్నట్లు ట్యాంకర్ ట్రాకర్ వెల్లడించింది. ఇది అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి, సముద్ర మార్గాల్లో ప్రయాణించే ట్యాంకర్ల యాజమాన్యాలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నౌకాదళ సంస్థలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..