Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..
- ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ..
- 60 శాతానికి పెరిగిన కరువు భత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ భారీ ఊరటనిచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50.46 లక్షల మంది ఉద్యోగులు, 68.27 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కేవలం జీతం పెరగడమే కాకుండా.. పాత బకాయిలు (అరియర్స్) కూడా ఒకేసారి చేతికి అందనుండటంతో లక్షలాది కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఈ పెంపు వల్ల పెరిగిన నిత్యావసర ధరల భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
డీఏ పెంపు వివరాలు..
కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రస్తుతమున్న 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. అంటే నేరుగా 2 శాతం పెంపును ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు (జనవరి మరియు జూలై) ఏఐసీపీఐ (AICPI) గణాంకాల ఆధారంగా ఈ డీఏను సవరిస్తుంది.
Also Read
- NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
పెరిగిన 2 శాతం డీఏ వల్ల మీ జీతంలో వచ్చే మార్పును ఈ ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ రూ. 20,000 ఉంటే పాత డీఏ (58%)కు రూ. 11,600, కొత్త డీఏ (60%)కు రూ. 12,000 పెరుగుతాయి. అంటే నెలవారీ పెరుగుదల రూ. 400 వరకు ఉంటుంది. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 400×3=1,200 రూపాయలు అదనంగా అందుతాయి.
Also Read:PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
ఒక వేళ బేసిక్ శాలరీ రూ. 50,000 ఉంటే పాత డీఏ (58%).. రూ. 29,000, కొత్త డీఏ (60%) ప్రకారం రూ. 30,000.. అంటే నెలవారీ పెరుగుదల రూ. 1,000. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 1,000×3=3,000 రూపాయలు ఏప్రిల్ నెల జీతంతో కలిపి వస్తాయి.
సాధారణంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించినప్పుడు, అది గడిచిన నెలల నుంచి అమలులోకి వస్తుంది. తాజా నిర్ణయం ప్రకారం.. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న మూడు నెలల పెరిగిన డీఏ బకాయిలను (Arrears), ఏప్రిల్ నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. అంటే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు జమ కానుంది. ఈ పెంపు జీతానికే పరిమితం కాకుండా.. పెన్షనర్లకు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ (DR) కు కూడా వర్తిస్తుంది. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆర్థికంగా అండ లభించనుంది.
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!