Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..
- ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ..
- 60 శాతానికి పెరిగిన కరువు భత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ భారీ ఊరటనిచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50.46 లక్షల మంది ఉద్యోగులు, 68.27 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కేవలం జీతం పెరగడమే కాకుండా.. పాత బకాయిలు (అరియర్స్) కూడా ఒకేసారి చేతికి అందనుండటంతో లక్షలాది కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఈ పెంపు వల్ల పెరిగిన నిత్యావసర ధరల భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
డీఏ పెంపు వివరాలు..
కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రస్తుతమున్న 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. అంటే నేరుగా 2 శాతం పెంపును ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు (జనవరి మరియు జూలై) ఏఐసీపీఐ (AICPI) గణాంకాల ఆధారంగా ఈ డీఏను సవరిస్తుంది.
Also Read
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
పెరిగిన 2 శాతం డీఏ వల్ల మీ జీతంలో వచ్చే మార్పును ఈ ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ రూ. 20,000 ఉంటే పాత డీఏ (58%)కు రూ. 11,600, కొత్త డీఏ (60%)కు రూ. 12,000 పెరుగుతాయి. అంటే నెలవారీ పెరుగుదల రూ. 400 వరకు ఉంటుంది. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 400×3=1,200 రూపాయలు అదనంగా అందుతాయి.
Also Read:PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
ఒక వేళ బేసిక్ శాలరీ రూ. 50,000 ఉంటే పాత డీఏ (58%).. రూ. 29,000, కొత్త డీఏ (60%) ప్రకారం రూ. 30,000.. అంటే నెలవారీ పెరుగుదల రూ. 1,000. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 1,000×3=3,000 రూపాయలు ఏప్రిల్ నెల జీతంతో కలిపి వస్తాయి.
సాధారణంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించినప్పుడు, అది గడిచిన నెలల నుంచి అమలులోకి వస్తుంది. తాజా నిర్ణయం ప్రకారం.. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న మూడు నెలల పెరిగిన డీఏ బకాయిలను (Arrears), ఏప్రిల్ నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. అంటే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు జమ కానుంది. ఈ పెంపు జీతానికే పరిమితం కాకుండా.. పెన్షనర్లకు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ (DR) కు కూడా వర్తిస్తుంది. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆర్థికంగా అండ లభించనుంది.
తాజావార్తలు
-
SrinivasaMangapuram : ఘట్టమనేని ‘జై కృష్ణ’ శ్రీనివాస మంగాపురం ఓవర్సీస్ రివ్యూ
-
Rohit Sharma Future: గిల్ చేతుల్లో రోహిత్ భవితవ్యం.. సెలెక్టర్లు కూడా సైడ్ అవ్వాల్సిందే!
-
Honor X6e: హానర్ X6e రిలీజ్.. 7,500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్
-
Atlee: బాలీవుడ్లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ
-
Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!