Iran US Israel War: ‘మధ్యప్రాచ్యాన్ని నరకంగా మారుస్తాం’.. ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran US Israel War: మధ్యప్రాచ్యంలో ప్రత్యక్ష యుద్ధంతో పాటు మాటల వార్ నడుస్తోంది. ఇటీవల ఇరాన్ తీరు మార్చుకోకపోతే విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితి వేగంగా ఉద్రిక్తంగా మారవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఖతమ్ అల్-అన్బియా (ఇరాన్ సైనిక కేంద్ర ప్రధాన కార్యాలయం) ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి మాట్లాడుతూ.. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, మధ్యప్రాచ్యం మొత్తం అమెరికా, ఇజ్రాయెల్లకు నరకంగా మారుతుందన్నారు. ఇరాన్ను ఓడించాలనుకోవడం వారిని కోలుకోలేని ఊబిలోకి నెట్టడమేనని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన పలు సంస్థలను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రతరం చేస్తామని డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ఇబ్రహీం జొల్ఫఘారి ఈ ప్రకటన చేయడం ఉద్రిక్తతలను పెంచించింది.
READ MORE: Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇదిలా ఉండగా.. ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి నెల రోజులు గడిచి పోయింది. ఇప్పటి వరకు హోర్ముజ్ జలసంధి ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రంపచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిని చుట్టుముట్టే ఈ వివాదం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలని లేదా హోర్ముజ్ మార్గాన్ని తెరవాలని, లేనిపక్షంలో ఆ దేశ ఇంధన వనరులపై దాడులు తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందించిన ట్రంప్, ఇరాన్కు ఇచ్చిన గడువు ముగిసిపోతోందని, కేవలం 48 గంటల్లోనే యుద్ధం భీకర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ తన వైఖరిని మారుస్తూ వస్తున్నారు. ఒకవైపు దౌత్యపరమైన చర్చల గురించి మాట్లాడుతూనే, మరోవైపు ఇరాన్ను ‘శిలాయుగం’ (Stone Age) నాటి పరిస్థితికి తీసుకెళ్తామంటూ కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..