US-Iran: ఇజ్రాయిల్పై దాడికి కౌంట్డౌన్.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య మరోసారి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సిరియాలోని దమస్కు పట్టణంలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడి తర్వాత మరింత ప్రమాదకరంగా మారింది. ఈ ఘటనలో పలువురు ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయిల్పై ఇరాన్ రగిలిపోతుంది. ఇప్పటికే హమాస్పై దాడి తర్వాత ఇజ్రాయిల్పై పగతో ఇరాన్ మండిపోతుంది. తాజా ఘటనతో అది కాస్తా ముదిరింది.
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..

ఇజ్రాయెల్పై ప్రతి దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. అమెరికాను హెచ్చరించింది. తాము ఇజ్రాయిల్పై యుద్ధానికి దిగబోతున్నామని.. ఈ విషయంలో అమెరికా దూరంగా ఉండాలని వార్నింగ్ జారీ చేసింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఇరాన్ సందేశం పంపింది. యుద్ధం విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని.. అప్పుడే మీరు సురక్షితంగా ఉండగలరని అమెరికాకు ఇరాన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Cloves Trouble: లవంగాలు అస్సలు తినకండి.. లేదంటే..!
ఇరాన్ హెచ్చరికలపై అమెరికా స్పందించింది. తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయరాదని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల అధికారి మొహమ్మద్ జంషిది తెలిపారు. కానీ అమెరికా మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరీ ఇరాన్ హెచ్చరికలపై యూఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Sarangadariya : ‘సారంగదరియా’ నుంచి ‘అందుకోవా’ సాంగ్ రిలీజ్..
సిరియా రాజధాని దమాస్క్లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇటీవల వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇరాన్ సైన్యానికి చెందిన ఇద్దరు మిలిటరీ కమాండర్లతో పాటు పాటు 13 మంది మరణించారు. మరోవైపు ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చెప్పారు. ఇరాన్ దాడులకు దిగుతుందనే భయంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. జీపీఎస్ నావిగేషన్ను నిలిపివేసింది. తమ సైనికులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసింది. రక్షణ సామర్ధ్యాన్ని విస్తరించింది. తన సరిహద్దులన్నింటిలో బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్తగా అన్నిచోట్ల బాంబు షెల్టర్లను తెరిచింది.
ఇది కూడా చదవండి: BJP Founder Day: కార్యకర్తలకు మోడీ, అమిత్ షా, నడ్డా శుభాకాంక్షలు
తాజావార్తలు
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!