BJP Founder Day: కార్యకర్తలకు మోడీ, అమిత్ షా, నడ్డా శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ తన 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకుంటోంది. 1980, ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపింపబడింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. గత పదేళ్లుగా దేశంలో కమలం పార్టీ అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమలనాథులు ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోడీ శనివారం ప్రసంగించనున్నారు. ప్రతి సంవత్సరం, వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో వివిధ కార్యక్రమాలు, ప్రసంగాలు, పార్టీ ప్రయాణం, విజయాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలపై చర్చిస్తుంటారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తారో చూడాలి.
మోడీ..
ఇక బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ కార్యకర్తలనుద్దేశించి ట్వీట్ చేశారు. భారతదేశం నలుమూలలా ఉన్న పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయులందరి కృషి, పోరాటాలు, త్యాగాలను స్మరించుకుందామని చెప్పారు. పార్టీ ఈ స్థాయిలో ఉండడానికి అనేక సంవత్సరాలుగా నాయకులు కష్టపడ్డారని గుర్తుచేశారు. బీజేపీకి ఎప్పుడూ దేశమే ప్రాముఖ్యమని.. దేశ అభివృద్ధి కోసం బీజేపీ పని చేస్తోందని మోడీ తెలిపారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
అమిత్ షా..
బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చే ప్రయాణంలో తమ జీవితాలను అంకితం చేసిన కార్యకర్తలకు నమస్కరిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. భారత్ను ప్రధాని మోడీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు.
జేపీ నడ్డా..
దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించడానికి కృషి చేసిన కార్యకర్తలకు, నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో వికసిత భారత్ కోసం కార్యకర్తలు కృషి చేయాలని.. సార్వత్రిక ఎన్నికల్లో మరింతగా పార్టీ విజయానికి కృషి చేయాలని నడ్డా పిలుపునిచ్చారు.
Today, on the Sthapana Diwas of @BJP4India, I extend my greetings to all fellow Party Karyakartas from across the length and breadth of India. I also recall with great reverence the hardwork, struggles and sacrifices of all those great women and men who built our Party over the…
— Narendra Modi (@narendramodi) April 6, 2024
Union Home Minister Amit Shah tweets "Infinite best wishes to all the workers on the foundation day of BJP. I salute the countless workers who have dedicated their lives in the journey of making BJP the world's largest political party…Today, under the leadership of PM Modi, the… pic.twitter.com/AQsfXpeCZg
— ANI (@ANI) April 6, 2024
BJP national president JP Nadda tweets "On the foundation day of the BJP, I pay my respects to all my senior leaders, who gave the organisation nationwide expansion through their sacrifice, dedication and hard work. On this occasion, heartiest wishes of the foundation day to all… pic.twitter.com/4UqP2yM4UU
— ANI (@ANI) April 6, 2024
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!