Site icon NTV Telugu

Iran Conflict: ఇరాన్ సుప్రీం లీడర్ ఆఫీసు లక్ష్యంగా దాడి.. టెహ్రాన్ నడిబొడ్డున భీకర యుద్ధం!

Iran Conflict

Iran Conflict

Iran Conflict: ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున అత్యంత రక్షణ ఉండే ప్రభుత్వ ప్రాంతంలో ఊహించని యుద్ధం జరిగింది. ఇరాన్ సైన్యం (IRGC), ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న MEK గ్రూపు సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన కార్యాలయం ఉండే మోతహరి కాంప్లెక్స్‌లోకి చొరబడి ఆపరేషన్ నిర్వహించాలని ముజాహిదీన్-ఎ-ఖల్క్ యోధులు (MEK) ప్రయత్నించారు. ఆ సమయంలో ఖమేనీకి విధేయులైన సైన్యం (IRGC) వారిని అడ్డుకోవడంతో భారీ కాల్పులు జరిగాయి. ఈ దాడిలో సుమారు 100 మంది MEK సభ్యులు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది.

READ ALSO: మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్‌, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్‌ కు సిద్ధం..!

ఈ ఘర్షణలు జరిగిన మోతహరి కాంప్లెక్స్ ఇరాన్‌లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశం. ఇక్కడ సుప్రీం లీడర్ ఖమేనీ ఆఫీసు ఉంటుంది. దాంతో పాటు ఇరాన్ నిఘా సంస్థ, న్యాయవ్యవస్థ కార్యాలయాలు ఉన్నాయి. ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఇల్లు, కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నాయి. MEK సభ్యులు విదేశీ నిఘా సంస్థల సాయంతో దాడికి ప్లాన్ చేశారని, కానీ సైన్యం ఆ దాడిని ముందే పసిగట్టి వారిని అడ్డుకుందని ఇరాన్ మీడియా తెలిపింది. ఇది వారి వైఫల్యమని ఎద్దేవా చేసింది. తాము చేసిన ఆపరేషన్ విజయవంతమైందని, తమ సభ్యులు 100 మందికి పైగా అమరులయ్యారని ఆ గ్రూపు ప్రకటించింది. అయితే తమ సభ్యులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులు కూడా చాలా మంది చనిపోయారని వారు పేర్కొన్నారు. ఈ ఘర్షణల తర్వాత మరణించిన వారి పేర్లను, అరెస్ట్ అయిన వారి వివరాలను MEK గ్రూపు ఐక్యరాజ్యసమితి (UN) మరియు మానవ హక్కుల సంస్థలకు అందజేసింది. ‘అల్-అఖ్బర్’ వంటి అంతర్జాతీయ పత్రికలు దీనిని ఇరాన్‌లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్‌గా వర్ణించాయి. ఈ తాజా ఘర్షణలు ఇరాన్ అంతర్గత భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని అన్నాయి.

READ ALSO: The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..

Exit mobile version