Who Rules Iran: ఇరాన్లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who Rules Iran: మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లో ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శనివారం వ్యూహాత్మక ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) గుండా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ఇరాన్ అంతర్గత అధికార పోరాటాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, ఆ దేశాన్ని అసలు ఎవరు నడిపిస్తున్నారనే సందేహాలను పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
Also Read
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
- Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
భారత్ తీవ్ర నిరసన
భారతీయ నౌకలపై కాల్పుల ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే ఇరాన్ రాయబారిని పిలిపించి అధికారికంగా నిరసన వ్యక్తం చేసింది. పౌర నౌకలపై ఏ పరిస్థితుల్లో కాల్పులు జరిపారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఇరాన్ అధికార యంత్రాంగంలో కనిపిస్తున్న స్పష్టమైన విభజన ఈ గందరగోళానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ ఇటీవల మాట్లాడుతూ.. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హోర్ముజ్ మార్గం తెరిచే ఉందని ప్రకటించారు. దీంతో నౌకల రాకపోకలు పెరిగాయి. ఇదే సమయంలో ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) మాత్రం తమ అనుమతి లేకుండా ఏ నౌక కూడా వెళ్లడానికి వీల్లేదని హెచ్చరిస్తోంది. విదేశాంగ మంత్రి మార్గం తెరిచి ఉందని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న IRGC దళాలు నౌకలపై కాల్పులు జరుపుతుండటం చూస్తుంటే.. ఇరాన్ పగ్గాలు ప్రభుత్వం చేతుల్లో లేవని, సైన్యం చేతుల్లోనే ఉన్నాయని స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
అధికార శూన్యతతో పెరుగుతున్న ముప్పు
సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో పెద్ద ఎత్తున అధికార శూన్యత ఏర్పడింది. అధ్యక్షుడు పేజెష్కియాన్ అమెరికాతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తుంటే, IRGC కమాండర్లు అహ్మద్ వహీదీ, హుస్సేన్ తాయేబ్ వంటి వారు మొండి వైఖరిని అవలంబిస్తున్నారని సమాచారం. ఏప్రిల్ ఆరంభంలో జరిగిన ఒక సమావేశంలో, IRGC ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని అధ్యక్షుడు స్వయంగా ఆరోపించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. ప్రపంచ చమురు, గ్యాస్ వ్యాపారంలో దాదాపు 20 శాతం వాటా ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో సుమారు 90 శాతం దిగుమతులను ఈ మార్గం నుంచే పొందుతుంది. ఇప్పుడు ఇక్కడ మైన్లు వేయడం, నౌకలపై దాడులు చేయడం వల్ల భారత ఇంధన భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోర్ముజ్ జలసంధి సురక్షితం కాదని తాజా కాల్పుల ఘటనతో తేలిపోయింది. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఎవరిది పైచేయి అవుతుందో తేలే వరకు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఈ అనిశ్చితి కొనసాగేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!
తాజావార్తలు
-
Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్కి కూడా అదే కారణమా?
-
Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
-
YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
-
Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!