PBKS vs RCB: అదే జరిగితే.. ఫైనల్కు పంజాబ్!
- క్వాలిఫయర్ 1లో పంజాబ్, బెంగళూరు ఢీ
- క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు
- మ్యాచ్ రద్దైతే ఫైనల్కు పంజాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పంజాబ్, బెంగళూరు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న గుజరాత్, ముంబై టీమ్స్ ఎలిమినేటర్లో ఢీకొంటాయి. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కు చేరుతుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫయర్ 2 రూపంలో (ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో మ్యాచ్) మరో అవకాశం ఉంటుంది.
నేడు ముల్లాన్పుర్లో తొలి క్వాలిఫయర్ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాతి 7.30కు ఆరంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్ 1కు రిజర్వ్ డే లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే.. పంజాబ్ నేరుగా ఫైనల్కు చేరుతుంది. అందుకు కారణం పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉండడమే. లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు 14 మ్యాచ్ల్లో చెరో 9 విజయాలు సాధించి.. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇరు జట్లకు పాయింట్లు సమంగా ఉన్నా.. బెంగళూరుతో పోలిస్తే పంజాబ్కు నెట్ రన్రేట్ ఎక్కువగా ఉంది. అయితే క్వాలిఫయర్ 1కు ఎలాంటి వర్షం ముప్పు లేదని సమాచారం.
Also Read
Also Read: Mahanadu 2025: నేడు మూడోరోజు టీడీపీ మహానాడు.. 5 లక్షల మందితో బహిరంగ సభ!
ఐపీఎల్ 2025లో పంజాబ్, బెంగళూరు టీమ్స్ రెండు సార్లు తలపడగా.. చెరోసారి గెలిచాయి. ఐపీఎల్లో ఇరు జట్ల మధ్య 35 మ్యాచ్లు జరగగా.. పంజాబ్ 18, బెంగళూరు 17 గెలిచింది. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముల్లాన్పుర్లో నాలుగు మ్యాచ్లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్లో 200 ప్లస్ స్కోర్లు నమోదు కాగా.. చివరి రెండు మ్యాచ్ల్లో మాత్రం తక్కువ స్కోర్లు వచ్చాయి. దాంతో ఈరోజు పిచ్ ఎలా ఉండబోతుందున్నది ఆసక్తికరంగా మారింది. బెంగళూరు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండగా.. పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది.
తాజావార్తలు
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!