IPL 2025 Final: ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే.. జ్యోతిష్యం చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ లో తలపడే రెండు జట్లు అంటూ భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బాట్స్మెన్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయాన్ని తెలిపాడు. రాబిన్ ఉతప్ప అభిప్రయం ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుందని అతని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఇకపోతే, పంజాబ్ కింగ్స్ తాజాగా ముంబై ఇండియన్స్పై ఘన విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచుల్లో 19 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్కి చేరింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో లక్నోపై గెలిచితే వారు కూడా టాప్ ప్లేస్కి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే, వారికి నెట్ రన్రేట్ కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. టోర్నమెంట్ చివరి దశకు వచ్చే సరికి జట్టు దగ్గర సరైన మోమెంటం ఉండటం చాలా ముఖ్యం. పంజాబ్ సీజన్ మొదట్లో అదిరిపోయే ఆరంభం చేసింది. మధ్యలో కొద్దిగా జారిపోయినా, ప్లేఆఫ్స్ ముందు మళ్లీ ఫామ్కి వచ్చింది. జట్టులోని బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉందని ఇది పంజాబ్కి కలిసొచ్చే అంశమని అన్నాడు. అంతేకాకుండా శ్రేయాస్ అయ్యర్ ను కూడా ఉతప్ప పొగిడాడు.
Read Also:Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?
శ్రేయాస్ ఎప్పుడూ మంచి కెప్టెన్.. KKRలోనూ అతను విలువైన కాప్టెన్సీ చేశాడు. కానీ, అక్కడ అతనికి తక్కువ గుర్తింపు లభించింది. ఇప్పుడు పంజాబ్కి వచ్చి 11 ఏళ్ల తర్వాత జట్టును ప్లేఆఫ్స్కి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇది అతని నాయకత్వ గుణాలను చూపిస్తుందని అన్నాడు. మొత్తానికి, రాబిన్ ఉతప్ప అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు జరుగుతుందని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!