IPL 2025 Final: ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే.. జ్యోతిష్యం చెప్పిన టీమిండియా మాజీ ప్లేయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ లో తలపడే రెండు జట్లు అంటూ భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బాట్స్మెన్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయాన్ని తెలిపాడు. రాబిన్ ఉతప్ప అభిప్రయం ప్రకారం.. ఈ సీజన్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుందని అతని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Read Also: Preity Zinta: హద్దులు దాటిన ఆనందం.. ప్రీతి జింటా సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా.. వీడియో వైరల్
Also Read
ఇకపోతే, పంజాబ్ కింగ్స్ తాజాగా ముంబై ఇండియన్స్పై ఘన విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచుల్లో 19 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్కి చేరింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో లక్నోపై గెలిచితే వారు కూడా టాప్ ప్లేస్కి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే, వారికి నెట్ రన్రేట్ కీలకంగా మారనుంది.
ఈ సందర్భంగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. టోర్నమెంట్ చివరి దశకు వచ్చే సరికి జట్టు దగ్గర సరైన మోమెంటం ఉండటం చాలా ముఖ్యం. పంజాబ్ సీజన్ మొదట్లో అదిరిపోయే ఆరంభం చేసింది. మధ్యలో కొద్దిగా జారిపోయినా, ప్లేఆఫ్స్ ముందు మళ్లీ ఫామ్కి వచ్చింది. జట్టులోని బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉందని ఇది పంజాబ్కి కలిసొచ్చే అంశమని అన్నాడు. అంతేకాకుండా శ్రేయాస్ అయ్యర్ ను కూడా ఉతప్ప పొగిడాడు.
Read Also:Obesity in children: పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయం.. పరిష్కార మార్గాలు లేవా..?
శ్రేయాస్ ఎప్పుడూ మంచి కెప్టెన్.. KKRలోనూ అతను విలువైన కాప్టెన్సీ చేశాడు. కానీ, అక్కడ అతనికి తక్కువ గుర్తింపు లభించింది. ఇప్పుడు పంజాబ్కి వచ్చి 11 ఏళ్ల తర్వాత జట్టును ప్లేఆఫ్స్కి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇది అతని నాయకత్వ గుణాలను చూపిస్తుందని అన్నాడు. మొత్తానికి, రాబిన్ ఉతప్ప అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు జరుగుతుందని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?