IPL Auction 2025: మొదటి రోజు అమ్ముడైన ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
- తొలి రోజు కోట్లు కుమ్మరించిన ప్రాంఛైజీలు
- పంత్కు రికార్డు ధర
- అమ్ముడైన ప్లేయర్స్ లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రోజులో ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్లేయర్స్ భారీ ధరకు అమ్ముడుపోయారు. ఈసారి పర్స్ వాల్యూను రూ.90 కోట్ల నుంచి రూ.120 కోట్లకు పెంచడంతో ఆటగాళ్లు అత్యధిక మొత్తం దక్కించుకున్నారు. జెడ్డాలో ఆదివారం జరిగిన వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరతో చరిత్ర సృష్టించాడు. పంత్ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రోజు 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా.. 10 ఫ్రాంఛైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.467.95 కోట్లు ఖర్చు చేశాయి.
అత్యధికంగా పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ మెలుగురిని మాత్రమే తీసుకుంది. మొత్తంగా రిషబ్ పంత్ (రూ.27 కోట్లు), విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్ (రూ.15.75 కోట్లు), అంతర్జాతీయ అరంగేట్రం చేయని క్రికెటర్లలో రసిఖ్ సలాం (రూ.6 కోట్లు) అత్యధిక ధర సొంతం చేసుకున్నారు. సోమవారం వేలంలో ఫ్రాంఛైజీలు మిగిలిన స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. డేవిడ్ వార్నర్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు మొదటి రోజు నిరాశే ఎదురైంది. నేడు ఎవరైనా తీసుకుంటారో చూడాలి.
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ప్లేయర్స్ లిస్ట్ ఇదే:
అర్ష్దీప్ సింగ్ – రూ. 18 కోట్లు (పంజాబ్ కింగ్స్-ఆర్టీఎమ్)
కగిసో రబడా – రూ. 10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
శ్రేయస్ అయ్యర్ – రూ. 26.75 కోట్లు (పంజాబ్ కింగ్స్)
జోస్ బట్లర్ – రూ.15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
మిచెల్ స్టార్క్ – రూ.11.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
మహమ్మద్ షమీ – రూ. 10 కోట్లు (హైదరాబాద్)
డేవిడ్ మిల్లర్ – రూ. 7.5 కోట్లు (లక్నో సూపర్ జెయంట్స్)
యుజ్వేంద్ర చహల్ – రూ. 18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
లియామ్ లివింగ్ స్టోన్ – రూ. 8.75 కోట్లు (ఆర్సీబీ)
కేఎల్ రాహుల్ – రూ. 14 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
హ్యారీ బ్రూక్ – రూ.6.25 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
ఎయిడెన్ మార్క్రమ్ – రూ. 2 కోట్లు (లక్నో)
డేవాన్ కాన్వే – 6.25 కోట్లు (సీఎస్కే)
రాహుల్ త్రిపాఠి – రూ. 3.40 కోట్లు (సీఎస్కే)
జేక్ ఫ్రీజర్-మెక్ గుర్క్ – రూ. 9 కోట్లు (ఢిల్లీ)
హర్షల్ పటేల్ – రూ. 8 కోట్లు (హైదరాబాద్)
రచిన్ రవీంద్ర – రూ. 4 కోట్లు (సీఎస్కే)
ఆర్ అశ్విన్ – రూ. 9.75 కోట్లు (సీఎస్కే)
వెంకటేశ్ అయ్యర్ – రూ. 23.75 కోట్లు (కేకేఆర్)
మార్కస్ స్టోయినీస్ – రూ. 11 కోట్లు (పంజాబ్ కింగ్స్)
మిచెల్ మార్ష్ – రూ. 3.4 కోట్లు (లక్నో)
గ్లెన్ మ్యాక్స్వెల్ – రూ. 4.20 కోట్లు (పంజాబ్)
క్వింటన్ డికాక్ – రూ. 3.60 కోట్లు(కేకేఆర్)
ఫిల్ సాల్ట్ – 11.50 కోట్లు (ఆర్సీబీ)
రెహ్మానుల్లా గుర్బాజ్ – రూ.2 కోట్లు (కేకేఆర్)
ఇషాన్ కిషన్ – రూ. 11.25 కోట్లు (సన్రైజర్స్)
జితేశ్ శర్మ – రూ. 11 కోట్లు (ఆర్సీబీ)
జోష్ హజెల్ వుడ్ – రూ.12.50 కోట్లు (ఆర్సీబీ)
ప్రసిధ్ కృష్ణ – రూ. 9 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
ఆవేశ్ ఖాన్ – రూ. 9.75 కోట్లు (లక్నో)
అన్రిచ్ నోర్జ్ – రూ. 6.5 కోట్లు (కేకేఆర్)
జోఫ్రా ఆర్ఛర్-రూ. 12.50 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
ఖలీల్ అహ్మద్ – రూ. 4.8 కోట్లు (సీఎస్కే)
టీ నటరాజన్ – రూ. 10.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
ట్రెంట్ బౌల్ట్ – రూ. 12.50 కోట్లు (ముంబై ఇండియన్స్)
మహీశ తీక్షణ – రూ. 4.40 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
రాహుల్ చహర్ – రూ. 3.2 కోట్లు (సన్రైజర్స్ హైదరాబాద్)
ఆడమ్ జంపా – రూ. 2.40 కోట్లు (సన్రైజర్స్ హైదరాబాద్)
వానిందు హసరంగా – రూ.5.25 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
నూర్ అహ్మద్ – రూ. 10 కోట్లు (సీఎస్కే)
అథర్వ టైడ్ – రూ.30 లక్షలు (సన్రైజర్స్)
నెహాల్ వదేరా – రూ.4.20 కోట్లు (పంజాబ్ కింగ్స్)
అంగ్క్రిష్ రఘువంశీ – రూ.3 కోట్లు (కేకేఆర్)
కరుణ్ నాయర్ – రూ. 50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
అభినవ్ మనోహర్ – రూ.3.20 కోట్లు (సన్రైజర్స్ హైదరాబాద్)
నిషాంత్ సింధు – రూ. 30 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
సమీర్ రిజ్వీ – రూ.95 లక్షలు (సీఎస్కే)
నమన్ ధిర్ – రూ. 5.25కోట్లు(ముంబై ఇండియన్స్ RTM)
అబ్దుల్ సమద్ – రూ.4.20 కోట్లు (లక్నో)
హర్ప్రీత్ బ్రార్ – రూ. 1.50 కోట్లు (పంజాబ్)
విజయ్ శంకర్ – రూ.1.20 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
మహిపాల్ లోమ్రోర్ – రూ. 1.70 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
అషుతోష్ శర్మ – రూ.3.80 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
కుమార్ కుశాంగ్ర – రూ. 65 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
రాబిన్ మింజ్ – రూ. 65 లక్షలు (ముంబై ఇండియన్స్)
అనూజ్ రావత్ – రూ.30 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
ఆర్యన్ జుయల్ – రూ. 30 లక్షలు (లక్నో)
విష్ణు వినోద్ – రూ. 30 లక్షలు (కేకేఆర్)
రసిక్ దార్ – రూ. 6 కోట్లు (ఆర్సీబీ)
ఆకాశ్ మధ్వాల్ – రూ. 1.2 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
మోహిత్ శర్మ – రూ.2.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
విజయ్ కుమార్ వైశాఖ్ – రూ. 1.8కోట్లు (పంజాబ్ కింగ్స్)
వైభవ్ అరోరా – రూ. 1.8 కోట్లు (కేకేఆర్)
యశ్ ఠాకూర్ – రూ. 1.6 కోట్లు (పంజాబ్ కింగ్స్)
సిమర్జీత్ సింగ్ – రూ. 1.5 కోట్లు (సీఎస్కే)
సుయాశ్ శర్మ – రూ. 2.60 కోట్లు (ఆర్సీబీ)
కర్ణ్ శర్మ – రూ. 50 లక్షలు (ముంబై ఇండియన్స్)
మయాంక్ మార్కండే – రూ. 30 లక్షలు (కేకేఆర్)
కుమార్ కార్తీకేయ – రూ. 30 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
తాజావార్తలు
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!