IPL 2024: ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టాలు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI’s Rule Change Ahead Of IPL 2024 Auction: 17వ సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాట్, బాల్ మధ్య పోటీని పెంచేందుకు బీసీసీఐ కొత్త రూల్ తీసుకొస్తుందట. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు సంధించేందుకు బౌలర్లకు అనుమతిస్తారట. దాంతో బంతిని దంచుడే లక్ష్యంగా పెట్టుకున్న పవర్ హిట్లర్లకు కళ్లెం పడ్డట్టే. ఈ కొత్త రూల్పై పలువురు బౌలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధన బౌలర్లకు కలిసొస్తుందని పేసర్ జయదేవ్ ఉనద్కత్ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు బౌన్సర్ల నిబంధనను బీసీసీఐ అమలు చేసింది. ఈ నిబంధన సక్సెస్ కావడంతో ఐపీఎల్ 2024లోనూ దీన్ని అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ను బీసీసీఐ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్ ప్రకారం.. తుది జట్టుతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్లను టాస్ సమయంలోనే ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నలుగురిలో ఎవరినైనా జట్టులోకి వచ్చి ఆడే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్లో త్వరగా వికెట్లు పడగానే స్పెషలిస్ట్ బ్యాటర్ను, బౌలింగ్ అవసరం అనుకుంటే స్పెషలిస్ట్ బౌలర్ను కెప్టెన్లు ఆడించారు. ఇది కొన్ని జట్లకు కలిసొచ్చింది కూడా. ఈసారి తీసుకొస్తున్న రెండు బౌన్సర్ల రూల్ బౌలర్లకు ఏమేర ఉపకరిస్తుందో చూడాలి.
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
Also Read: Rishabh Pant IPL Auction: ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే తొలి కెప్టెన్గా రిషబ్ పంత్ రికార్డు!
ఐపీఎల్ 2024 వేలం మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత్ ప్లేయర్స్ కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఖాళీలు మాత్రం 77 ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. 17వ సీజన్ మినీ వేలం దుబాయ్ వేదికగా జరగనుంది. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించే వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!