IPL 2024: ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బ్యాటర్లకు కష్టాలు తప్పవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI’s Rule Change Ahead Of IPL 2024 Auction: 17వ సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. బ్యాట్, బాల్ మధ్య పోటీని పెంచేందుకు బీసీసీఐ కొత్త రూల్ తీసుకొస్తుందట. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు సంధించేందుకు బౌలర్లకు అనుమతిస్తారట. దాంతో బంతిని దంచుడే లక్ష్యంగా పెట్టుకున్న పవర్ హిట్లర్లకు కళ్లెం పడ్డట్టే. ఈ కొత్త రూల్పై పలువురు బౌలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధన బౌలర్లకు కలిసొస్తుందని పేసర్ జయదేవ్ ఉనద్కత్ అభిప్రాయపడ్డాడు.
ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు బౌన్సర్ల నిబంధనను బీసీసీఐ అమలు చేసింది. ఈ నిబంధన సక్సెస్ కావడంతో ఐపీఎల్ 2024లోనూ దీన్ని అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ను బీసీసీఐ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూల్ ప్రకారం.. తుది జట్టుతో పాటు నలుగురు సబ్స్టిట్యూట్ ప్లేయర్లను టాస్ సమయంలోనే ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నలుగురిలో ఎవరినైనా జట్టులోకి వచ్చి ఆడే అవకాశం ఉంటుంది. బ్యాటింగ్లో త్వరగా వికెట్లు పడగానే స్పెషలిస్ట్ బ్యాటర్ను, బౌలింగ్ అవసరం అనుకుంటే స్పెషలిస్ట్ బౌలర్ను కెప్టెన్లు ఆడించారు. ఇది కొన్ని జట్లకు కలిసొచ్చింది కూడా. ఈసారి తీసుకొస్తున్న రెండు బౌన్సర్ల రూల్ బౌలర్లకు ఏమేర ఉపకరిస్తుందో చూడాలి.
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
Also Read: Rishabh Pant IPL Auction: ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే తొలి కెప్టెన్గా రిషబ్ పంత్ రికార్డు!
ఐపీఎల్ 2024 వేలం మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత్ ప్లేయర్స్ కాగా.. 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఖాళీలు మాత్రం 77 ఉన్నాయి. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. 17వ సీజన్ మినీ వేలం దుబాయ్ వేదికగా జరగనుంది. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ నిర్వహించే వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!