E-Cigarettes : కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్న స్కూల్ పిల్లలు
నేటి సమాజంలో టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ ప్రభావం ఎక్కువగా యువతపై పడుతోంది. అయితే.. కౌమార దశలో ఉన్న యువత టెక్నాలజీలో ఉన్న మంచికంటే చెడువైపే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే.. కొత్త రకం మత్తుకు స్కూల్ పిల్లలు అలవాటు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులు ఈ- సిగరెట్లకు అలవాటు పడుడుతున్నట్లు తెలుస్తోంది. మత్తు ఇచ్చే ఫ్లేవర్స్ వేసుకుని బడాబాబుల పిల్లలు ఎలక్ర్టానిక్ సిగరెట్లు తాగుతున్నట్లు, స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే ఈ-సిగరెట్లు కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్న పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ లలో సైబరాబాద్ ఎస్వోటీ పోలీస్ ల సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఎలక్ట్రానికి సిగరెట్లు తాగుతున్న విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. సబ్ వే లో ఈ-సిగరెట్లు తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు.
Also Read : Sagileti katha: చికెన్ చుట్టూ ‘సగిలేటి కథ’..ట్రైలర్ కి అనూహ్య స్పందన
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూళ్ల పక్కనే ఈ సబ్ వేలు ఉన్నాయి. సబ్ వేల్లో విద్యార్థులను అదుపులోకి తీసుకుని, పిల్లలు, పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. రాయదుర్గంలోని సబ్ వేపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇప్పటి వరకు మొత్తం 12 కేసులు నమోదు చేసిన్నట్లు సమాచారం. అయితే.. ఈ సందర్భంగా.. Ntv తో మాదాపూర్ డీసీపీ సందీప్ మాట్లాడుతూ.. ఇంటర్ నేషనల్ స్కూల్ లలో పిల్లలకు పెద్ద మొత్తం లో పాకెట్ మనీ ఇస్తున్నారు… ఈ-సిగరెట్స్ కు ఇంటర్ నేషనల్ స్కూల్ లలోని పిల్లలు అలవాటు పడ్డారు.. బయటి రాష్ట్రాల నుండి ఈ సిగరెట్స్ ను తెచ్చి.. ఇక్కడ పిల్లలకు అమ్ముతున్నారు.. ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో 12 కేసులు నమోదు చేసాం అని ఆయన తెలిపారు. ‘పిల్లల పై తల్లితండ్రుల నిఘా ఉండట్లేదు..స్కూల్ బయట ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని స్కూల్ మేనేజ్ మెంట్లు వున్నాయి.. ఇకపై ఇలాంటి కేసుల్లో పిల్లలు పట్టుబడితే..స్కూల్ లపై కూడా కేసులు నమోదు చేస్తాము.. మొదటి సారి కాబట్టి కౌన్సిలింగ్ తో సరిపెడుతున్నాము.. మరో సారి ఈ సిగరెట్స్ తాగుతూ దొరికితే… మైనర్ లు అని కూడా చూడము.. పిల్లలతో పాటు పేరెంట్స్ ను కూడా బాధ్యులను చేస్తాము.. ఈ సిగరెట్స్ వల్ల పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది… ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల వ్యవహారాలు మాకు తెలుస్తున్నాయి.. ఇకపై విద్యార్థుల మీద పోలీస్ ల నిరంతర నిఘా వుంటుంది’ అని డీసీపీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!