Dr Sarvepalli Radhakrishnan: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..?
- 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుతానిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు.
- 1952లో భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా.
- 1962లో భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.
- 1954లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teachers Day 2024 Dr Sarvepalli Radhakrishnan: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు గౌరవనీయ విద్యావేత్త, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన ఓ పండితుడు, ఉపాధ్యాయుడు అలాగే ఓ తత్వవేత్త కూడా. 1962 నుండి భారతదేశం అంతటా పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులకు నేర్చుకోవడంలో సహాయపడటానికి కృషి చేసిన దేశంలోని ఉపాధ్యాయులందరికీ నివాళులర్పించడం ద్వారా ఈ రోజును డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు..
Also Read
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుతానిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో తత్వశాస్త్రం అభ్యసించాడు.
* డాక్టర్ రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయం నుండి కలకత్తా విశ్వవిద్యాలయం వరకు వివిధ కళాశాలల్లో బోధించారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, అలాగే బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా సేవలందించారు.
* అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో బోధించిన మొదటి భారతీయుడు. 1930లో, చికాగో విశ్వవిద్యాలయంలో తులనాత్మక మతంలో హాస్కెల్ లెక్చరర్గా పని చేసారు.
* డాక్టర్ రాధాకృష్ణన్ ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) కు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. అలాగే 1948లో యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
* డాక్టర్ రాధాకృష్ణన్ 1952లో భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు. 1962లో భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.
* ఆయనకు 1954లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నోబెల్ బహుమతికి 27 సార్లు, సాహిత్యంలో నోబెల్ బహుమతికి పదహారు సార్లు, నోబెల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యారు.
* ఆయన రచనలలో ఇండియన్ ఫిలాసఫీ, ది ఫిలాసఫీ ఆఫ్ ది ఉపనిషత్తులు, యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ వెస్ట్రన్ థాట్, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!