Pakistan: పెరిగిన ఆహారం, ఇంధన ధరలు.. భారీ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది పాకిస్తాన్లో ఇంధనం, ఆహార ధరలలో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం 1.30 పెరిగింది. వార్షిక ద్రవ్యోల్బణం 29.83 శాతానికి పెరిగిపోయింది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) ప్రకారం, సున్నితమైన ధరల సూచిక (ఎస్పీఐ) పెరుగుదలకు టమోటాలు (16.85 శాతం), ఎల్పీజీ (9.82 శాతం), పెట్రోల్ (7.86 శాతం) ధరలు పెరగడమే కారణమని పేర్కొంది. డీజిల్ (7.82 శాతం), కారంపొడి (7.58 శాతం), వెల్లుల్లి (5.71 శాతం), ఉల్లి (5.50 శాతం), పొడి పాలు (5.17 శాతం), గుడ్లు (3.86 శాతం), బాస్మతి బియ్యం (2.06 శాతం) పెరగడం కూడా వార్షిక ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని తెలిపింది. మరోవైపు ఆవాల నూనె (1.63 శాతం), చికెన్ (1.40 శాతం), కూరగాయల నెయ్యి 1 కేజీ (0.51 శాతం), కూరగాయల నెయ్యి 2.5 కిలోలు (0.36 శాతం), పప్పుధాన్యాల ధరలు కాస్త తగ్గాయి. (0.22 శాతం), గోధుమ పిండి (0.20 శాతం), పెసరపప్పు (0.03 శాతం) ధరలు కాస్త తగ్గాయి. దేశంలోని 17 నగరాల్లోని 50 మార్కెట్ల నుంచి 51 వస్తువుల ధరలను సేకరించడం ద్వారా పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ సున్నితమైన ధరల సూచికను గణించింది. వారంలో 51 వస్తువులలో 23 (45.10%) వస్తువుల ధరలు పెరిగాయి. 7(13.72%) వస్తువులు తగ్గగా.. 21 (41.18%) వస్తువుల ధరలు మారలేదు. ఈ వస్తువులలో పాలు, చక్కెర, కట్టెల ధరలు పెరిగాయి. గోధుమ పిండి, కూరగాయలు, నెయ్యి ధరలు తగ్గాయి. అయితే బట్టలు, విద్యుత్ ధరలు మారలేదని తెలిసింది.
Also Read: Tamilnadu: ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశంపై నిరాకరణ.. హైకోర్టు సీరియస్
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఉత్తర భారత్ లాగానే పాకిస్థాన్లో కూడా ప్రజల ప్రధాన ఆహారం గోధుమలు. తమకు అవసరమైన గోధుమలను పాకిస్థానీలే పండించుకుంటారు. మిగిలినదాన్ని ఎగుమతి కూడా చేస్తారు. కానీ.. గత ఏడాది పాకిస్థాన్ను ముంచెత్తిన వరదల దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి. ఏడాది పొడుగునా వాడుకోవడం కోసం రైతులు ఇళ్లల్లో దాచుకున్న గోధుమలు కూడా తడిసి ముద్దయిపోయాయి. అయితే, పంజాబ్ ప్రాంతంలో వరదల తీవ్రత అంతగా లేనందున.. ఈ ఏడాది ఆహార సంక్షోభం రాదనే పాకిస్థాన్ ప్రభుత్వం భావించింది. దీంతో దిగుమతులపై పెద్దగా దృష్టి సారించలేదు. క్రమంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని పరిస్థితి. కారణమేదైనా గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడడంతో వాటి ధరలు విపరీతంగా, పేదలు భరించలేనంతగా పెరిగిపోయాయి. గత వారం గోధుమల ధరలు కాస్త తగ్గినా అది పాకిస్థాన్ ప్రజలకు ఊరట కలిగించే విషయమేమీ కాదు.
నార్త్ నజీమాబాద్కు చెందిన సకీనా అనే గృహిణి మాట్లాడుతూ.. తన పిల్లలకు ముఖ్యంగా మాంసాహారాన్ని వండిపెట్టాలో తనకు తెలియదని చెప్పారు. అంతలా ధరలు పెరిగిపోయాయన్నారు. ఎదుగుతున్న పిల్లలున్నారని, అతి తక్కువ జీతంతో వంటగదిని నడపడం అసాధ్యంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!