Tamilnadu: ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశంపై నిరాకరణ.. హైకోర్టు సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: వితంతువులను దేవాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి చట్టాల ద్వారా పరిపాలించబడే ఈ నాగరిక సమాజంలో జరగవని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. స్త్రీకి తనకంటూ ఒక గుర్తింపు ఉందని స్పష్టం చేసింది. ఒక వితంతు స్త్రీ ఆలయంలోకి ప్రవేశించడం వంటి ప్రాచీన విశ్వాసాలు రాష్ట్రంలో ప్రబలంగా ఉండటం చాలా దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తంగమణి దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఆగస్టు 4 నాటి తన ఉత్తర్వుల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోడ్ జిల్లాలోని నంబియూర్ తాలూకాలో ఉన్న పెరియకరుపరాయణ్ దేవాలయంలోకి ప్రవేశించడానికి తనకు, తన కుమారుడికి రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. వితంతు మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదని మద్రాసు హైకోర్టు తీవ్రంగా మందలించింది.
Also Read: Wheat Import Tax: గోధుమలపై దిగుమతి పన్ను తగ్గింపు.. పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
వితంతువు ఆలయంలోకి ప్రవేశిస్తే అపవిత్రత వస్తుందన్న ప్రాచీన విశ్వాసం రాష్ట్రంలో నెలకొనడం చాలా దురదృష్టకరమని న్యాయమూర్తి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ అన్నారు. సంస్కర్తలు ఈ అనవసరమైన నమ్మకాలన్నింటినీ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. ఇవి మనిషి తన సౌలభ్యం కోసం తయారు చేసుకున్న సిద్ధాంతాలు, నియమాలు ఆమె తన భర్తను కోల్పోయిన కారణంగా స్త్రీని అవమానించడం చాలా తప్పని కోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ పాలనలో ఉన్న నాగరిక సమాజంలో ఇవన్నీ ఎప్పటికీ కొనసాగవని జస్టిస్ ఆనంద్ వెంకటేష్ అన్నారు. పండుగలో పాల్గొనకుండా మహిళను ఎవరూ ఆపలేరని మద్రాసు హైకోర్టు తెలిపింది. మహిళను బెదిరిస్తున్న వారిని పిలిపించి , ఆమె కుమారుడిని ఆలయంలోకి రాకుండా , ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకోలేమని స్పష్టంగా తెలియజేయాలని గోబిచెట్టిపాళయం పోలీసులను కోర్టు ఆదేశించింది .ఇంత జరిగినా శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని కోర్టు పేర్కొంది. ఆగస్టు 9, 10 తేదీల్లో జరిగే ఉత్సవాల్లో పిటిషనర్తోపాటు అతని కుమారుడు కూడా పాల్గొనేలా పోలీసులు చూడాలని ఆదేశించింది.
Also Read: PF Balance: కంపెనీ పీఎఫ్ డబ్బులు డిపాజిట్ చేయలేదా? ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు
ఈరోడ్ జిల్లాలోని క్తేసేవియూర్ పోస్ట్ కలైమగల్ స్ట్రీట్లో ఉన్న పెరియాకారుపరాయణ్ ఆలయంలోకి ప్రవేశించేందుకు పోలీసు రక్షణ కల్పించాలని తంగమణి చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.పిటిషనర్ ప్రకారం, ఆలయంలో పూజారిగా ఉన్న తన భర్త ఆగస్టు 28, 2017 న మరణించాడు. పిటిషనర్, ఆమె కుమారుడు ఆలయంలో నిర్వహించే ఆడి ఉత్సవాల్లో పాల్గొనాలని అనుకున్నారు, అయితే ఎం అయ్యు, ఎం మురళి బెదిరించారు. ఆమె వితంతువు కాబట్టి గుడిలోకి వెళ్లకూడదని చెప్పారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
తాజావార్తలు
-
Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!