Inflation: గతంలో కంటే ఈ సారి పండుగలు స్పెషల్.. కావాల్సిన మిఠాయిలు కొనుక్కోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inflation: పండుగల సీజన్లో మిఠాయిలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. రక్షాబంధన్, జన్మాష్టమి, దసరా, దీపావళి సందర్భంగా మిఠాయిలకు గిరాకీ ఉండడంతో ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి సీన్లో కాస్త మార్పు కనిపిస్తోంది. బికనెర్వాలా, బికాజీ ఫుడ్స్, హల్దీరామ్ వంటి మార్కెట్లోని అగ్రశ్రేణి కంపెనీలకు చెందిన లడ్డూలు, మెత్తటి రసగుల్లాలు, శెనగపిండి బర్ఫీ వంటి స్వీట్ల తయారీకి అవసరమైన పదార్థాల ధరలు పెరిగాయి. కానీ పండుగ సీజన్ వినియోగదారులను జేబులకు చిల్లు పడేసే అవకాశాలు కనిపించడం లేదు.. ఇందుకు కారణం ఏంటో స్వీట్ మేకర్సే స్వయంగా చెప్పారు.
గతేడాదితో పోల్చితే ఈసారి ధరలు చాలా వరకు పెరిగాయి. కానీ స్వీట్ల ధరల్లో మాత్రం ఎలాంటి పెరుగుదల ఉండదని బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ మనోజ్ వర్మ తెలిపారు. సాధారణంగా ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పటికీ భారతీయ సంప్రదాయ స్వీట్లను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏడాది క్రితం కంటే చౌకగా ఉన్నాయి. ఇది ధరలను నియంత్రించడంలో దోహదపడుతుందని ఆయన అన్నారు. గతేడాదితో పోల్చితే డ్రైఫ్రూట్స్ ధరలు 10-12 శాతం పెరగ్గా, పండగ సందర్భంగా పామాయిల్ ధరలు గతేడాది కంటే తక్కువగా ఉండడంతో స్వీట్ తయారీదారులు, కొనుగోలుదారులకు మేలు జరుగుతోంది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also:Ramya Krishna : నేటి తరం హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణ..
మరోవైపు, హోల్సేల్ మార్కెట్లో పాల ధర స్థిరంగా ఉంది. దీని కారణంగా నెయ్యి వంటి ఇతర ముఖ్యమైన పాల ఉత్పత్తులు చౌకగా మారాయి. అంతే కాకుండా ఈ సీజన్లో చక్కెర వాడకం కూడా పెరుగుతుంది. దీని ధరలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఆగస్టు 29 నాటికి చక్కెర టోకు ధర ఏడాది క్రితంతో పోలిస్తే 3.63 శాతం ఎక్కువ. కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. కొన్ని తగ్గుదల కనిపించాయి. ఈ కారణంగానే మిఠాయిల ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు.
ఆగస్టులో ఓనం, రక్షాబంధన్తో ప్రారంభమై డిసెంబర్లో క్రిస్మస్ వరకు కొనసాగే అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ సీజన్లో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి స్వీట్ తయారీదారులు తమ వస్తువుల ధరలో ఏదైనా పెరుగుదలను గ్రహించాలని యోచిస్తున్నారు. బికానో, బికనెర్వాలా ఫుడ్స్ చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. పరిశ్రమలో సవాళ్లు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ధరలను పెంచడం లేదని ఆయన చెప్పారు. ఈసారి తమ ఫోకస్ అంతా వినియోగదారులపైనే ఉంటుందన్నారు.
Read Also:Vijay: నాకు ఫస్ట్ అసలు శివ కనెక్ట్ కాలేదు… ఆ తర్వాత సమంత ఇన్వాల్వ్ అయ్యింది
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!