WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC India: అఫ్గానిస్థాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో గెలిచి 94 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ఏకపక్షంగా ముగించింది. అయితే ఈ ఘన విజయం భారత అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో మాత్రం ఎలాంటి మార్పు తీసుకురాలేదు.
దీనికి కారణం అఫ్గానిస్థాన్తో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ (WTC) సైకిల్లో భాగం కాదు. అఫ్గానిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి మద్దతుగా నిర్వహించిన ప్రత్యేక ద్వైపాక్షిక మ్యాచ్ మాత్రమే కావడంతో ఈ ఫలితానికి పాయింట్ల పట్టికపై ప్రభావం ఉండదు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో భారత్ 48.15% విజయాల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది టెస్ట్లు ఆడిన భారత జట్టు నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేయగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ఇంగ్లండ్ పర్యటనతో ఈ డబ్ల్యూటీసీ చక్రాన్ని ప్రారంభించిన భారత్ ఐదు టెస్ట్ల సిరీస్ను 2-2తో సమం చేసింది. అనంతరం వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. అయితే అదే జోరును కొనసాగించలేక దక్షిణాఫ్రికా చేతిలో సొంతగడ్డపై 2-0తో వైట్వాష్కు గురైంది. ఈ పరాజయం కారణంగానే భారత్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఫైనల్ బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లు టీమిండియాకు కీలకంగా మారాయి.
ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ ఇంకా తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్లు, న్యూజిలాండ్లో రెండు టెస్ట్లు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల సిరీస్ ఉన్నాయి. ఫైనల్ అవకాశాలను అందుకోవాలంటే ఈ తొమ్మిది మ్యాచ్ల్లో కనీసం 7 విజయాలు అందుకోవాలి. ముఖ్యంగా న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు ప్రదర్శనపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. అక్కడ భారత్ చివరిసారిగా 2009లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. దీంతో కివీస్ గడ్డపై జరిగే రెండు టెస్ట్లు డబ్ల్యూటీసీ భవిష్యత్తును నిర్ణయించే మ్యాచ్లుగా మారనున్నాయి. అఫ్గానిస్థాన్పై సాధించిన భారీ విజయం పాయింట్లు ఇవ్వకపోయినా, రాబోయే కఠిన సిరీస్లకు ముందు భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!