Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే..
- ఢిల్లీ నుంచి రైతులకి మంచి చేయాలని వచ్చాం..
- ఛాపర్ నుంచి ప్రత్యక్షంగా ఏరియల్ సర్వే చూశాము..
- వరి పంట నష్టం బాగా జరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీ నుంచి రైతులకి మంచి చేయాలని వచ్చామన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నరసింహుల గూడెం ప్రాంతంలో పంట నష్టం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు శివరాత్రి చౌహాన్ బండి సంజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఖమ్మంలో ఏరియల్ సర్వే చేసిన అనంతరం ప్రజలతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఛాపర్ నుంచి ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. వరి పంట నష్టం బాగా జరిగిందన్నారు. ఇళ్లలో సామాను, వంట సామాగ్రి, తినేది , అవులు, గేదెలు కూడా దెబ్బతిందన్నారు. మీకు సహాయం చేయడం కోసం వచ్చానని తెలిపారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చానని అన్నారు. రైతులు కంట నీరు పెట్టుకోవద్దన్నారు. రైతులకి ఏ విధంగా సహకరించాలో ఆలోచిస్తున్నామని తెలిపారు.
Read also: Balapur Ganesh: సర్వాంగ సుందరంగా ముస్తాబైన బాలాపూర్ గణేష్ విగ్రహం..
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
కేంద్రం, రాష్ట్రప్రభుత్వం రెండూ కూడా సమన్వయంతో సహకారం అందిస్తామని క్లారిటీ ఇచ్చాఉ. ముగ్గురు మంత్రులు కుడా మీకు వున్నారన్నారు. సీఎంతో కూడా మాట్లాడతామన్నారు. రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అన్నారు. రాజకీయాలు చేయడానికి రాలేదు.. రాజకీయాలలోకి రాలేదు.. గతంలో సర్కార్ మమ్ములను ఉపయోగించు కోలేదని తెలిపారు. గతంలో వున్న నిధులను కేంద్రం నిధులను వాడుకోలేదన్నారు. ఫసల్ భీమా అమలు చేయలేదు.. అందువల్ల రైతులు కష్టాల్లో వున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆదుకోలేదు… అందువల్ల కేంద్రం ఆదుకోలేక పోయిందన్నారు. గత ప్రభుత్వంకు కేంద్ర సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. ఇప్పుడు జరిగిన తాత్కాలిక మూగా ఏమి చేయాలో పరిష్కారం చేస్తాం ఆదుకుంటామని తెలిపారు.
ప్రముఖ గణేష్ దేవాలయాలు ఇవే.. ఒక్కసారి లుక్ వేయండి.
తాజావార్తలు
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..