Covid Outbreak: 3 వేల మార్క్కు దగ్గరగా యాక్టివ్ కేసులు.. అప్రమత్రంగా ఉండాలని కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Outbreak: భారత్లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి. కేరళకు చెందిన ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరుకుంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. 10 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
Read Also: Terrorists Attack: ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల మెరుపు దాడి.. ఐదుగురు సైనికులు మృతి
Also Read
కొవిడ్ -19 నుంచి ఇప్పటివరకు 4,44,70,887 మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు, 220.67 కోట్ల (220,67,79,081) డోస్ల కొవిడ్ వ్యాక్సిన్ను అందించారు. JN.1 మొదటిసారిగా గుర్తించబడిన కేరళలో, గత 24 గంటల్లో మరో 265 కేసులు నమోదైన తర్వాత క్రియాశీల కేసులు 2,606కి పెరిగాయి. దేశవ్యాప్తంగా బుధవారం వరకు JN.1 వేరియంట్కు సంబంధించిన 21 కేసులు కనుగొనబడ్డాయి. గురువారం, భారతదేశంలో 594 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య అంతకుముందు రోజు 2,311 నుండి 2,669కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఆరుగురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, పంజాబ్కు చెందిన ఒకరు కరోనా కారణంగా మరణించారు.
Read Also: Year End 2023 : 2023 లో వార్తల్లో నిలిచిన భయంకరమైన వ్యాధులు ఇవే..
బీహార్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్
బీహార్లోని పాట్నాలో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐజీఐఎంఎస్)లో ఒకరిని పాజిటివ్గా గుర్తించగా… బిహ్తాలోని ఈఎస్ఐసీ హాస్పిటల్లో మరొకరికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరు వ్యక్తులను హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ఇద్దరు రోగుల ప్రయాణ చరిత్ర కనుగొనబడిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొదటి రోగి పాట్నాలోని గార్డ్నిబాగ్లో నివసిస్తున్న 29 ఏళ్ల వ్యక్తి కాగా, రెండో రోగి బంకా జిల్లా వాసి. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించిన తర్వాత, రోగులు JN.1తో బాధపడుతున్నారా లేదా అనేది తెలుస్తుంది.
రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
ప్రస్తుతం కొవిడ్-19 కేసులు పెరగడం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయపడవద్దని కేంద్రం ప్రభుత్వం కోరింది. ముందుజాగ్రత్త చర్యగా ఫేస్ మాస్క్లు ధరించాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించారు. కొవిడ్ వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పారు. కేసులు పెరుగుతున్నప్పటికీ, 92.8 శాతం కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నాయని, ఇది తేలికపాటి అనారోగ్యాన్ని సూచిస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు. భారతదేశంలో JN.1 వేరియంట్ కారణంగా ఎటువంటి క్లస్టరింగ్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అన్ని కేసులు తేలికపాటివిగా గుర్తించబడ్డాయి. రోగులు ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకున్నారని వారు తెలిపారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!