Covid Outbreak: 3 వేల మార్క్కు దగ్గరగా యాక్టివ్ కేసులు.. అప్రమత్రంగా ఉండాలని కేంద్రం సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid Outbreak: భారత్లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరిగాయి. కేరళకు చెందిన ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరుకుంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. 10 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
Read Also: Terrorists Attack: ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల మెరుపు దాడి.. ఐదుగురు సైనికులు మృతి
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
కొవిడ్ -19 నుంచి ఇప్పటివరకు 4,44,70,887 మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు, 220.67 కోట్ల (220,67,79,081) డోస్ల కొవిడ్ వ్యాక్సిన్ను అందించారు. JN.1 మొదటిసారిగా గుర్తించబడిన కేరళలో, గత 24 గంటల్లో మరో 265 కేసులు నమోదైన తర్వాత క్రియాశీల కేసులు 2,606కి పెరిగాయి. దేశవ్యాప్తంగా బుధవారం వరకు JN.1 వేరియంట్కు సంబంధించిన 21 కేసులు కనుగొనబడ్డాయి. గురువారం, భారతదేశంలో 594 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య అంతకుముందు రోజు 2,311 నుండి 2,669కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం ఆరుగురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అందులో కేరళకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, పంజాబ్కు చెందిన ఒకరు కరోనా కారణంగా మరణించారు.
Read Also: Year End 2023 : 2023 లో వార్తల్లో నిలిచిన భయంకరమైన వ్యాధులు ఇవే..
బీహార్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్
బీహార్లోని పాట్నాలో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐజీఐఎంఎస్)లో ఒకరిని పాజిటివ్గా గుర్తించగా… బిహ్తాలోని ఈఎస్ఐసీ హాస్పిటల్లో మరొకరికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇద్దరు వ్యక్తులను హోమ్ ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. ఇద్దరు రోగుల ప్రయాణ చరిత్ర కనుగొనబడిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొదటి రోగి పాట్నాలోని గార్డ్నిబాగ్లో నివసిస్తున్న 29 ఏళ్ల వ్యక్తి కాగా, రెండో రోగి బంకా జిల్లా వాసి. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించిన తర్వాత, రోగులు JN.1తో బాధపడుతున్నారా లేదా అనేది తెలుస్తుంది.
రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
ప్రస్తుతం కొవిడ్-19 కేసులు పెరగడం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయపడవద్దని కేంద్రం ప్రభుత్వం కోరింది. ముందుజాగ్రత్త చర్యగా ఫేస్ మాస్క్లు ధరించాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించారు. కొవిడ్ వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నొక్కి చెప్పారు. కేసులు పెరుగుతున్నప్పటికీ, 92.8 శాతం కేసులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నాయని, ఇది తేలికపాటి అనారోగ్యాన్ని సూచిస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు. భారతదేశంలో JN.1 వేరియంట్ కారణంగా ఎటువంటి క్లస్టరింగ్ కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అన్ని కేసులు తేలికపాటివిగా గుర్తించబడ్డాయి. రోగులు ఎటువంటి సమస్యలు లేకుండా కోలుకున్నారని వారు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..