పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రీక్వార్టర్స్ లో 50 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో తలపడి 3-2 తేడాతో విజయం సాధించింది. వినేష్కి ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఆమె అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత వినేష్ భావోద్వేగానికి గురైంది. ఒకానొక సమయంలో వినేష్ 0-2తో వెనుకంజలో ఉంది. చివరి 15 సెకన్లలో వినేష్ జపాన్ రెజ్లర్ను ఓడించి మూడు పాయింట్లు సాధించింది. వినేష్ కాస్త ఆలస్యంగా సెమీఫైనల్కు చేరుకుంది.