US: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్.. ఆందోళనలో కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఈ ఏడాదిలోనే పలువురు హత్యకు గురయ్యారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన విద్యార్థి కిడ్నాప్ అయి.. అనంతరం హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలు మరువక ముందే తెలంగాణకు చెందిన మరొక విద్యార్థి మిస్సింగ్ భయాందోళనకు గురి చేస్తోంది. మే 2 నుంచి రూపేష్ చంద్ర అనే విద్యార్థి ఆచూకీ లభించడం లేదు. చికాగోలో ఇతడు అదృశ్యమయ్యాడు. ఈ మేరకు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాను సంప్రదిస్తున్నట్లు రూపేష్ చంద్ర తండ్రి సదానందం తెలిపారు. అలాగే ఎన్నారైలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Uttarpradesh : 29ఏళ్ల నాటి కేసు.. 100వారెంట్ల తర్వాత కూడా హాజరుకాని ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్రతో అతని తండ్రి సదానందం మే 2న మధ్యాహ్నం కొడుకుతో వాట్సప్ కాల్ మాట్లాడారు. ఆయా విషయాలు మాట్లాడుకున్నారు. అనంతరం అతని ఫోన్ స్విచ్ఛాప్లోకి వెళ్లిపోయిందని సదానందం తెలిపారు. కుటుంబ సభ్యులు అతని రూమ్మేట్స్తో మాట్లాడారు. ఎవర్నో కలవడానికి వెళ్లాడని బదులిచ్చారు. వారు ఎవరో తమకు తెలియదని సమాధానం వచ్చింది. రూపేప్ చంద్ర అదృశ్యమైనట్లు చికాగో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అలాగే అమెరికా ఎంబసీని కూడా సంప్రదించినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: BJP MLAs: ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..
ఇదిలా ఉంటే తమ కుమారుడి ఆచూకీ తెలుసుకోవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సదానందం లేఖ ద్వారా సహాయం కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం.. చికాగో ఎంబసీకి సమాచారం చేరవేసింది. రూపేష్ చంద్ర ఆచూకీ కనుక్కోవాలని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లి డబ్బు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. కానీ కొద్దిరోజులకే అతడు శవమై కనిపించాడు. ఇలా అగ్రరాజ్యంలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!