Indian Army Secret Mission: చప్పుడు కాకుండా వెళ్లి.. చక్కగా పని ముగించుకొచ్చారు.. ఇండియన్ ఆర్మీ సీక్రెట్ మిషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Army Secret Mission: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కారాలతో భారత సైన్యం నిర్వహించిన ఒక కోవర్ట్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ రహస్య ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను బహిర్గతం చేయడం చాలా అరుదు. తాజాగా కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కార ప్రకటనతో ఈ రహస్య ఆపరేషన్ వివరాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: కేవలం రూ.3,500కే గోవా టూర్..! TGSRTC అదిరిపోయే ఆఫర్.. మిస్ కావద్దు.!
Also Read
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
ఇండియాకు మయన్మార్తో దాదాపు 1600 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం నుంచి గత కొన్నేళ్లుగా ఉల్ఫా(ఐ) అస్సాంకు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గతేడాది భారత సైన్యం మయన్మార్ భూభాగంలో ఓ రహస్య ఆపరేషన్ నిర్వహించింది. మన సైన్యం ఈ కోవర్ట్ ఆపరేషన్ను మయన్మార్ భూభాగంలో ఉన్న మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది. భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో 2025 జులై 11 నుంచి 13 వరకు ఈ ఇండియన్ ఆర్మీ ఈ సీక్రెట్ ఆపరేషన్ను నిర్వహించింది. ఈ ఆపరేషన్లో 9 మంది మిలిటెంట్ నాయకులు మరణించారు. గతేడాది జులైలో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఇండిపెండెంట్) (ఉల్ఫా (ఐ)) విడుదల చేసిన ఒక ప్రకటనలో మయన్మార్లోని సగైంగ్ ప్రాంతంలో జరిపిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో తమ సంస్థకు చెందిన అగ్ర నాయకులు మరణించినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ సంస్థ ఈ దాడి చేసింది భారత ఆర్మీనేనని ఆరోపించింది. కానీ దీనిపై ఆనాడు కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి ఇలాంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి కేంద్రం ధ్రువీకరించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం ప్రకటించిన శౌర్య చక్ర అవార్డుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
21వ పారా స్పెషల్ఫోర్స్కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘటాగె ఆదిత్య శ్రీకుమార్కు కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ అవార్డుతో ఈ స్పెషల్ ఆపరేషన్ గురించి బయటికి వచ్చింది. మయన్మార్ భూభాగంలో అత్యంత కచ్చితత్వంతో ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మిలిటెంట్ క్యాంప్ను ధ్వంసం చేసినందుకు ఆదిత్య శ్రీకుమార్ను కేంద్రం ఈ పురస్కారంతో సన్మానించింది. దేశ వ్యతిరేక ముఠాలకు చెందిన శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
READ ALSO: Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ రోజు పాకిస్థాన్లో హైప్రొఫైల్ మీటింగ్..
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!