NTV Telugu Site icon

Video: 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ ఏం చేశారంటే..!

Ups

Ups

56 ఏళ్ల వయసులో ఆర్మీ మేజర్ జనరల్ విరామం లేకుండా 25 పుల్-అప్‌లను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను ఈ 1.4 లక్షల వీక్షించగా.. నాలుగు వేల లైక్‌లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న న‌భా న‌టేష్‌..

మేజర్ జనరల్ ప్రసన్న జోషి నిమిషంలోపు 25 పుల్ అప్‌లను ప్రదర్శించారు. ఈ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 56 ఏళ్ల వృద్ధుడి శక్తి, తీవ్రమైన వ్యాయామం చేసి అనేక మంది మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్టింట వైరల్‌‌గా మారింది.

ఇది కూడా చదవండి: UPSC: సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

46 సెకన్ల ఉన్న క్లిప్‌లో జోషి తన యూనిఫాం ధరించి ఇతర ఆర్మీ సిబ్బందితో జిమ్‌లో కనిపించారు. విరామం లేకుండా పుల్-అప్‌లను ప్రదర్శిస్తుండగా ఇతరులు అతని కోసం కౌంట్‌డౌన్ చేశారు. జిమ్‌లోని ప్రతి ఒక్కరూ మేజర్ జనరల్ జోషికి శారీరక ఆరోగ్యం పట్ల ఉన్న నిబద్ధతకు చప్పట్లు కొట్టి ప్రశంసించారు. నెటిజన్లు కూడా జోషి ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Parthasarathi: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం