India-Canada: సిక్కు వేర్పాటువాదులకు భారత రాయబారి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు ఆ దేశంలోని భారత రాయబారి వార్నింగ్ ఇచ్చారు. నిజ్జర్ హత్య కేసు విషయంలో హద్దులు దాటుతున్నారంటూ.. మండిపడ్డారు. నిజ్జర్ హత్య కేసు విషయంలో కెనడాతో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సిక్కు వేర్పాటువాద గ్రూప్లు రెడ్లైన్ దాటుతున్నారని హెచ్చరించారు. కెనడా గడ్డ నుంచి భారత భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించే తన ప్రధాన ఆందోళన అని స్పష్టం చేశారు.
READ MORE: Sam Pitroda : మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
నిజ్జర్ హత్య కేసును కెనడా గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు భారతీయులను ఇటీవల కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై సంజయ్ వర్మ తొలిసారిగా స్పందించారు. ‘‘ద్వంద్వ జాతీయతను భారత్ ఎన్నటికీ గుర్తించదు. ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులుగానే పరిగణిస్తాం. భారత ప్రాదేశిక సమగ్రతపై దుష్టశక్తుల కన్ను పడింది. తమ స్వస్థలాన్ని భారత్ నుంచి విడదీయాలని చూస్తున్న కొందరు.. తమ చర్యలతో రెడ్లైన్ దాటుతున్నారు. దీన్ని న్యూదిల్లీ దేశ భద్రతకు ముప్పుగానే పరిగణించి నిర్ణయాలు తీసుకుంటుంది జాగ్రత్త..!’’ అని హెచ్చరించారు.
భారత్-కెనడా మధ్య దౌత్య విభేదాల గురించి ఆయన స్పందించారు. ‘‘ఇటీవల కొంతమంది భారత సంతతి కెనడియన్లు దశాబ్దాల క్రితం నాటి సమస్యలను మళ్లీ లేవనెత్తి ఇరు దేశాల మధ్య ప్రతికూల వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని కెనడా అపార్థం చేసుకోవడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. సమయం చూసుకుని దీనిపై ఇరు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటాయి’’ అని వర్మ అన్నారు. ఇటీవల కెనాడాలోని ఒంటారియోలో చేపట్టిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలు వెలుగుచూశాయి. ఈ అంశం వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు కెనడాలోని భారత రాయబారి ఈ అంశంపై స్పందించలేదు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. భారత్ దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..