Asian Games 2023: ఆసియా గేమ్స్ సెమీస్ చేరిన భారత జట్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian womens Cricket Team Entered Semi Finals of Asian Games 2023: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 సెమీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ సెమీస్ చేరింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ (టాప్ సీడ్) మెరుగ్గా ఉండడంతో.. స్మృతీ మంధాన సేన సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. సెప్టెంబర్ 24న సెమీఫైనల్ 1లో పాకిస్తాన్తో భారత్ తలపడే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ (67), జెమిమా రోడ్రిగ్స్ (47 నాటౌట్), స్మృతీ మంధాన (27), రిచా ఘోష్ (21 నాటౌట్) రాణించారు. మలేషియా బౌలర్లు ఇజ్జతీ ఇస్మాయిల్, మాస్ ఎలీసా చెరో వికెట్ పడగొట్టారు. భారత్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం పడడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టాక మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
Also Read: Khalistani Terrorist: కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య.. భారత్లో పలు క్రిమినల్ కేసులు!
అనంతరం మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలోనే మళ్లీ వర్షం పడింది. మలేషియా ఇన్నింగ్స్లో కేవలం రెండు బంతులు మాత్రమే పడ్డాయి. వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో.. అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. టాప్ సీడ్తో ఆసియా గేమ్స్ బరిలోకి దిగిన భారత్.. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైనా సెమీస్కు చేరింది. ఇక ఆదివారం జరగనున్న తొలి సెమీస్లో భారత్ గెలిస్తే పతకం ఖాయం అవుతుంది. భారత పురుషుల జట్టు తొలిసారి ఆసియా గేమ్స్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. పురుషుల క్రికెట్ మ్యాచ్లు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి.
Rain 🌧️ has the final say after India’s terrific batting display!
India march to the semifinals in the #AsianGames 👏👏
Scorecard ▶️https://t.co/c5tw7bD88x#IndiaAtAG22 pic.twitter.com/Wrb3GeAStw
— BCCI Women (@BCCIWomen) September 21, 2023
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..