Arundhati Reddy: మూడు మ్యాచ్లు ఓడాక.. డ్రెస్సింగ్ రూంలో జరిగిందిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arundhati Reddy: ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. భారత మహిళల క్రికెట్ జట్టు చిరస్మరణీయ విజయం సాధించి ప్రపంచ కప్ గెలుచుకుంది. తొలిసారి టీమిండియా ప్రపంచకప్ ను ఒడిసిపట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఎలాంటి తడబాటు లేకుండా అదరగొట్టింది. వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో తెలంగాణకు చెందిన అరుంధతి రెడ్డి ఉండటం మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణం. అయితే.. తాజాగా అరుంధతి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. వరల్డ్ కప్ సాధించడం ఎంతో గర్వకారణం అని వెల్లడించింది.
READ MORE: SEBI: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?.. రూ.10కి బంగారం కొనేవారికి సెబీ తీవ్ర హెచ్చరిక
Also Read
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
వరల్డ్ కప్ ప్రారంభంలో ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఇండియా మాత్రం ఓటములతో ఢీలా పడింది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిన విషయం తెలిసిందే. “వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన తరువాత డ్రెస్సింగ్ రూమ్లో పరిస్థితి ఏంటి..?” అని యాంకర్ ప్రశ్నించారు. ఎంతో బాధగా ఉన్నామని అరుంధతి చెప్పింది. “ఓకే ఇంతవరకు అయ్యిందేదో అయిపోయింది. మళ్లీ దాన్ని తలుచుకుని బాధపడటం అనవసరం. ఇక నుంచి మనం ఏం చేయాలి..? అనే అంశంపై చర్చించాం. అలాగే ఓడిన మ్యాచ్లకు సంబంధించిన రివ్వ్యూస్ కూడా చేశాం. ఎక్కడ తప్పులు చేశాం? అనే విషయాలను గురించి తెలుసుకున్నాం. అలా చర్చించుకుంటూ పోతే చాలా తప్పులు దొరుకుతాయి. అందుకే ఆ అంశంపై ఎక్కువగా చర్చించడం ఆపేశాం. ఇక వాట్ నెక్ట్స్.. ఇప్పుడు ఏం చేస్తే మనం ఈ న్యూజిలాండ్ మ్యాచ్ గెలుస్తాం..? అనే అంశంపై ఎక్కువగా చర్చించాం. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ మాపై కొంచెం సిరియస్ అయ్యారు. ఆయన ఇంటెన్సన్ గెలవాలనే.. మా టీం ఎంతో బలమైంది. కానీ.. అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయాం. అందుకే ఎమోషన్ అయ్యారు. అనంతరం.. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన ఇద్దరు మీటింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకు అయిపోయింది పక్కన పెట్టండి. ఇక నుంచి ఏంటి..? మనం వరల్డ్ కప్ సాధించడానికి ఏం చేయాలి..? న్యూజిలాండ్ను ఎలా ఎదుర్కోవాలనే టాపిక్స్పై చాలా వరకు చర్చించాం.” అని అరుంధతి వెల్లడించింది.
తాజావార్తలు
-
Australian Cricketer: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆస్ట్రేలియా క్రికెటర్కు జీవితకాల జైలు శిక్ష!
-
PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
-
AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!