Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind W vs Eng W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు లక్ష్యానికి చేరువైనప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ అమీ జోన్స్ 45 బంతుల్లో 64 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించగా, కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో డానీ గిబ్సన్ కేవలం 12 బంతుల్లో 30 పరుగులు చేసి వేగంగా ఆడి స్కోరును పరుగులు పెట్టించింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు పడగొట్టగా, రెణుకా సింగ్, రాధా యాదవ్, శ్రీ చరణి, షెఫాలీ వర్మ తలో వికెట్ తీశారు.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు మొదట్లోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన (1), షెఫాలీ వర్మ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వచ్చిన యస్తిక భాటియా (15), హర్మన్ప్రీత్ కౌర్ (17), భారతి ఫుల్మాలి (18) కూడా పెద్దగా రాణించలేకపోయారు. అయితే వికెట్ కీపర్ కం బ్యాటర్ రిచా ఘోష్ ఒంటరి పోరాటం చేసింది. ఆమె 36 బంతుల్లో 68 పరుగులు చేసి ఆశలను సజీవంగా ఉంచింది. ఆమెకు రాధా యాదవ్ 16 పరుగులతో సహకరించినా.. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ మూడు వికెట్లు తీసి భారత్ను దెబ్బతీయగా, డానీ గిబ్సన్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్ చెరో రెండు వికెట్లు సాధించారు.
ప్రపంచకప్కు ముందు జరిగిన ఈ వార్మప్ మ్యాచ్లో ఓటమి పాలవడం టీమిండియాకు హెచ్చరికగా మారింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం, డెత్ ఓవర్లలో వికెట్ల పతనం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్, కొందరు యువ ఆటగాళ్ల పోరాటం మాత్రం భారత జట్టుకు సానుకూల అంశాలుగా నిలిచాయి.
తాజావార్తలు
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
-
Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
-
Kia Seltos GTX(O): కియా సెల్టోస్ రెండు కొత్త వేరియంట్లు రిలీజ్.. Level 2+ ADAS, అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Fitness: 60 ఏళ్లు దాటాక ఏ వ్యాయామం బెస్ట్? నడక, ఈత కాదు.. శాస్త్రవేత్తలు సూచిస్తున్నది ఇదే!
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..