Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind W vs Eng W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు లక్ష్యానికి చేరువైనప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ అమీ జోన్స్ 45 బంతుల్లో 64 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించగా, కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ 57 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో డానీ గిబ్సన్ కేవలం 12 బంతుల్లో 30 పరుగులు చేసి వేగంగా ఆడి స్కోరును పరుగులు పెట్టించింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు పడగొట్టగా, రెణుకా సింగ్, రాధా యాదవ్, శ్రీ చరణి, షెఫాలీ వర్మ తలో వికెట్ తీశారు.
Also Read
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు మొదట్లోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన (1), షెఫాలీ వర్మ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వచ్చిన యస్తిక భాటియా (15), హర్మన్ప్రీత్ కౌర్ (17), భారతి ఫుల్మాలి (18) కూడా పెద్దగా రాణించలేకపోయారు. అయితే వికెట్ కీపర్ కం బ్యాటర్ రిచా ఘోష్ ఒంటరి పోరాటం చేసింది. ఆమె 36 బంతుల్లో 68 పరుగులు చేసి ఆశలను సజీవంగా ఉంచింది. ఆమెకు రాధా యాదవ్ 16 పరుగులతో సహకరించినా.. చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో లిన్సే స్మిత్ మూడు వికెట్లు తీసి భారత్ను దెబ్బతీయగా, డానీ గిబ్సన్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్ చెరో రెండు వికెట్లు సాధించారు.
ప్రపంచకప్కు ముందు జరిగిన ఈ వార్మప్ మ్యాచ్లో ఓటమి పాలవడం టీమిండియాకు హెచ్చరికగా మారింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం, డెత్ ఓవర్లలో వికెట్ల పతనం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్, కొందరు యువ ఆటగాళ్ల పోరాటం మాత్రం భారత జట్టుకు సానుకూల అంశాలుగా నిలిచాయి.
తాజావార్తలు
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!