Kho Kho World Cup: ఖోఖో ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఒకటి కాదు రెండు!
- ఖోఖో ప్రపంచకప్ 2025 భారత్దే
- ఫైనల్లో 78-40తో నేపాల్ను చిత్తు
- 54-36తో నేపాల్పై పురుషుల జట్టు విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్ను గెలుచుకుంది.
ఫైనల్లో భారత్ 34-0తో ఆధిక్యాన్ని సాధించింది. నేపాల్ పుంజుకుని 35-24తో రేసులోకి వచ్చింది. ఈ సమయంలో కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే, వైష్ణవి రాణించడంతో విమెన్ ఇన్ బ్లూ 49 పాయింట్ల భారీ ఆధిక్యానికి దూసుకెళ్లింది. చివరకు 78-40తో గెలిచింది. టోర్నీలో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గ్రూప్ ఎలో ఉన్న భారత్ మూడు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాపై 157 పాయింట్ల విజయం (175-18), ఇరాన్పై 84 పాయింట్ల విజయం (100-16), మలేషియాపై 80 పాయింట్ల విజయం (100-20)ను నమోదు చేసింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను 66-16తో ఓడించి ఫైనల్స్లోకి ప్రవేశించింది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
పురుషుల ఫైనల్లో భారత్ 54-36తో నేపాల్పై గెలిచింది. ఆరంభంలో ఎటాకింగ్ గేమ్ ఆడిన భారత్.. 26-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత నేపాల్ పుంజుకుంది. దూకుడు కొనసాగించిన భారత్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఖోఖో ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత జట్లను ప్రధాని మోడీ అభినందించారు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తి అని ఎక్స్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!