India vs UAE: తొలి మ్యాచ్లో భారత్ రికార్డు విజయం.. రప్ఫాడించిన బౌలర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ఆసియా కప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లో యూఏఈపై భారత్ రికార్డు విజయం సాధించింది.. యూఏఈపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రత్యర్థి జట్టు యూఏఈ కేవలం 58 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. భారత్ బ్యాటర్లు కేవలం 4.3 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు. ఇన్నింగ్స్ మొదటి బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ, ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు. మొదటి ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్లో శుభ్మన్ గిల్ 4, 6 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో అభిషేక్ శర్మ 6, 4 బాదాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, జునైద్ సిద్ధిఖీ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ రాగానే సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి ఓవర్లో శుభ్మన్ గిల్ ఫోర్ బాది మ్యాచ్ని ముగించాడు.
READ MORE: PM Modi: ఇజ్రాయిల్ దాడిని ఖండించిన మోడీ, ఖతార్ ఎమిర్కు ఫోన్ కాల్..
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో యూఏఈకి ఇది అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్ రౌండర్ శివమ్ దూబే విధ్వంసం సృష్టించారు. కుల్దీప్ 2.1 ఓవర్లలో 7 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టారు. శివమ్ 2 ఓవర్లలో నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.
READ MORE: Nepal Palace Massacre: ప్రేమకు బలైన నేపాల్ రాజ కుటుంబం.. ప్యాలెస్లో ఊచకోత.. ఆ నాటి విషాద గాథ
మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో యూఏఈ కేవలం 31 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు తరఫున అలీషాన్ షరాఫు (22) అత్యధిక స్కోరు సాధించాడు. కెప్టెన్ మహ్మద్ వసీం 19 పరుగులకే పరిమితమయ్యాడు. వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (3), హర్షిత్ కౌశిక్ (2) సహా ఎనిమిది మంది ఆటగాళ్ళు రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!