IND vs SL ODI: భారత్తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టు ప్రకటన..
- భారత్-శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్ల సిరీస్ జరగనుంది.
- భారత్ తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది.
- శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
IND vs SL ODI: భారత్, శ్రీలంక మధ్య 3 ODI మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి వన్డే ఆగస్టు 2న జరగనుంది. తాజాగా భారత్ తో వన్డే సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ జట్టులో ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్, ఫాస్ట్ బౌలర్ దాషున్ షనకకు చోటు దక్కకపోవడం విశేషం. ఇక భారత్ తో వన్డే సిరీస్ కు శ్రీలంక జట్టును చూస్తే ఇలా ఉంది.
Viral video: చైనాలో భారత ఇన్ఫ్లుయెన్సర్ వెకిలిచేష్టలు.. మండిపడుతున్న నెటిజన్లు
Also Read
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జెనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లాగే, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణన్, అకిల ధనన్థితజయ్. డి లు టీం లో ఉన్నారు. ఇకపోతే., ఆగస్టు 2 నుంచి భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 4న ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. కాగా, సిరీస్ లో మూడో, చివరి వన్డే ఆగస్టు 7న జరగనుంది. ఈ సిరీస్ లోని 3 వన్డేలు కొలంబోలో జరగనున్నాయి. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు వన్డే సిరీస్లో టీమ్ ఇండియాలో భాగం కానున్నారు.
Nirmala sitharaman: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం..
శ్రీలంకతో భారత జట్టు ప్రస్తుతం 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ను ఆడుతున్న తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీలంకతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను DLS పద్దతిలో ఓడించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 జూలై 30న జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు 2-0తో సిరీస్లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది .
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో