Ind vs SA: నేడు విశాఖలో ఇండియా VS సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. విరాట్కి కలిసొచ్చిన స్టేడియం మనదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa ODI Decider in Vizag: విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది.. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డే లా సీరీస్ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.. కోహ్లీ, రోహిత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అందరి దృష్టి రో-కోలపైనే ఉంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకున్నాయి. రెండు టీమ్స్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి. ఈ మ్యాచ్కు పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. టికెట్ల విషయంలో అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఆన్ లైన్ టికెట్స్ విక్రయాలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్స్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి..
READ MORE: Hyderabad: నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..
Also Read
కాగా.. ఈ మ్యాచ్ కోసం విరాట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విరాట్ కోహ్లికి దేశంలో అత్యంత కలిసొచ్చిన స్టేడియం విశాఖ కావడం విశేషం. మన స్టేడియంలో 7 వన్డేలు ఆడిన కోహ్లీ 97.83 సగటుతో 587 పరుగులు చేశాడు. వైజాగ్లో అతడు మూడు సెంచరీలు, రెండు అర్ధశతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఆడిన తొలి రెండు వన్డేల్లో అతను శతకాలు సాధించాడు. ప్రస్తుత సిరీస్లో వరుసగా రెండు శతకాలు సాధించిన విరాట్.. తనకు బాగా కలిసొచ్చిన మైదానంలోనూ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
READ MORE: Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్ డేట్పై క్లారిటీ..!
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!