Smart Phone market: స్మార్ట్ఫోన్ మార్కెట్ ఢీలా..27 శాతం తగ్గుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సరఫరా ఢీలా పడింది. అక్టోబర్-డిసంబర్లో దేశీయంగా స్మార్ట్ ఫోన్ల సరఫరాలు 27 శాతానికి పైగా తగ్గి 2.96 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే 2021లో ఇదే మూడు నెలల్లో 4.06 కోట్ల స్మార్ట్ ఫోన్లు సరఫరా అయ్యాయని మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వల్లే ఈసారి మార్కెట్లో తగ్గుదల కనిపించిందని పేర్కొంది. చిప్ల సరఫరా మెరుగుపడినా, అన్ని రకాల సేవలు-వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుతున్నాయని వివరించింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి పనికోసం చాలామంది కొత్త స్మార్ట్ ఫోన్లు కొనడం వల్ల కూడా ప్రస్తతం గిరాకీ పరిమితమై ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మధ్యతరగతి వర్గాల పైనే ద్రవ్యోల్బణ ప్రభావం ఎక్కువగా ఉండి.. అందుబాటు ధర స్మార్ట్ఫోన్ల కొనులుగో తగ్గి ఉండొచ్చని పేర్కొంది. కాగా, ఖరీదైన స్మార్ట్ఫోన్ల సరఫరాలో పెరుగుదల కనిపించడం గమనార్హం.
Also Read: D Boss: ప్రేమికుల రోజు అయిపోగానే బాస్ సినిమా అప్డేట్ వస్తుంది…
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
- Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
బడ్జెట్ ఫోన్లపైనే ప్రభావం
ఐడీసీ రూపొందించిన నివేదిక ప్రకారం.. రూ.25,000లోపు ధర ఫోన్ల సరఫరాలు 15% తగ్గాయి. అయితే రూ.25,000 – 41,000 శ్రేణిలోని మధ్య స్థాయి, ప్రీమియం ఫోన్ల సరఫరాలు మాత్రం 20% పెరిగాయి. రూ.41,000 పైన ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సరఫరాలు 55% రాణించడం విశేషం. ప్రారంభ స్థాయి అంటే రూ.12,500 లోపు ధర స్మార్ట్ఫోన్లు సరఫరాలు 54 శాతం నుంచి 46 శాతానికి పరిమితయ్యాయి. ఈ విభాగంలో కొత్త ఫోన్లు రాకపోవడంతో వృద్ధి పరిమితమైంది. పెరుగుతున్న ధరలు, అదనపు నిల్వల కారణంగా 2023 ప్రథమార్ధం వరకు ఇబ్బందులు కనిపించొచ్చు. కాగా, మార్కెట్ వాటా విషయంలో డిసెంబరు త్రైమాసికంలో 18.6%, వార్షికంగా 21% వాటాతో షియోమీ అగ్రస్థానంలో ఉంది. అయితే సరఫరాలు సంఖ్యాపరంగా చూస్తే డిసెంబరు త్రైమాసికంలో 38.3%, వార్షికంగా 25% తగ్గాయి. ప్రీమియం విభాగంలో 60% మార్కెట్ వాటాతో యాపిల్ అగ్రస్థానంలో ఉండగా, శామ్సంగ్ 21% వాటా పొందింది. 2022లో మొత్తంమీద 20.1 కోట్ల సెల్ఫోన్లు ఇండియన్ మార్కెట్లో సరఫరా అయ్యాయి. 2021తో పోలిస్తే ఇవి 12% తక్కువ. ఇందులో ఫీచర్ ఫోన్లు 5.7 కోట్లు ఉన్నాయి. వీటి సరఫరాలు కూడా 18% తగ్గాయి.
Also Read: Amit Shah: నేడే ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి
తాజావార్తలు
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!