Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..భారత్ నుంచి ఒకే ఒక్కడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో సెంచరీ సాధించడం ద్వారా హిట్మ్యాన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్గా, ఓవరాల్గా నాలుగో కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు రోహిత్. కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురి పేరిట ఉండేది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్, ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.
Also Read: Mark Waugh: ‘కోహ్లీ ఏమోకానీ.. రోహిత్ మ్యాచ్ను దూరం చేసేస్తాడు’
Also Read
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
రోహిత్ తన కెరీర్లో ఇప్పటివరకు కెప్టెన్గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్టు జట్టు కెప్టెన్గా హిట్మ్యాన్ సాధించిన తొలి సెంచరీ ఇదే. తాజా సెంచరీతో హిట్మ్యాన్ భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోనీ, కోహ్లీలకు సాధ్యంకాని అత్యంత అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.టెస్టుల్లో రెండేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ కెరీర్లో 9వ టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీ చేసేందుకు 171 బంతులు ఆడిన రోహిత్ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్ 43వ శతకాన్ని పూర్తి చేశాడు.
లీడ్లో టీమిండియా
కాగా, ఈ మ్యాచ్లో రోహిత్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. ఓపెనర్గా బరిలోకి దిగిన హిట్మ్యాన్ ఓ ఎండ్లో వరుస వికెట్లు పడుతున్నా.. గొప్ప పట్టుదలతో బ్యాటింగ్ను కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేశాడు. టీమ్మేట్స్ పుజారా (7), కోహ్లీ (12), సూర్యకుమార్ యాదవ్ (8) ఆసీస్ స్పిన్నర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయినా రోహిత్ మాత్రం వారిపై ఎదురుదాడికి దిగి సెంచరీ చేశాడు. తర్వాత కూడా ఇన్నింగ్స్ను (118 నాటౌట్) కొనసాగిస్తున్నాడు. హిట్మ్యాన్కు జతగా జడేజా (34) క్రీజ్లో ఉన్నాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 80 ఓవర్లలో 226/5 స్కోర్ చేసింది. ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: Viral News: యో చూస్కోబడ్లా..భర్త అనుకుని వేరే వ్యక్తి బైక్పై వెళ్లిన భార్య
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!