Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..భారత్ నుంచి ఒకే ఒక్కడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా క్రికెట్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో సెంచరీ సాధించడం ద్వారా హిట్మ్యాన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్గా, ఓవరాల్గా నాలుగో కెప్టెన్గా రికార్డుల్లోకెక్కాడు రోహిత్. కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురి పేరిట ఉండేది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్, ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.
Also Read: Mark Waugh: ‘కోహ్లీ ఏమోకానీ.. రోహిత్ మ్యాచ్ను దూరం చేసేస్తాడు’
Also Read
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
రోహిత్ తన కెరీర్లో ఇప్పటివరకు కెప్టెన్గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్టు జట్టు కెప్టెన్గా హిట్మ్యాన్ సాధించిన తొలి సెంచరీ ఇదే. తాజా సెంచరీతో హిట్మ్యాన్ భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోనీ, కోహ్లీలకు సాధ్యంకాని అత్యంత అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.టెస్టుల్లో రెండేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్ కెరీర్లో 9వ టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీ చేసేందుకు 171 బంతులు ఆడిన రోహిత్ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్ 43వ శతకాన్ని పూర్తి చేశాడు.
లీడ్లో టీమిండియా
కాగా, ఈ మ్యాచ్లో రోహిత్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. ఓపెనర్గా బరిలోకి దిగిన హిట్మ్యాన్ ఓ ఎండ్లో వరుస వికెట్లు పడుతున్నా.. గొప్ప పట్టుదలతో బ్యాటింగ్ను కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేశాడు. టీమ్మేట్స్ పుజారా (7), కోహ్లీ (12), సూర్యకుమార్ యాదవ్ (8) ఆసీస్ స్పిన్నర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయినా రోహిత్ మాత్రం వారిపై ఎదురుదాడికి దిగి సెంచరీ చేశాడు. తర్వాత కూడా ఇన్నింగ్స్ను (118 నాటౌట్) కొనసాగిస్తున్నాడు. హిట్మ్యాన్కు జతగా జడేజా (34) క్రీజ్లో ఉన్నాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి టీమిండియా 80 ఓవర్లలో 226/5 స్కోర్ చేసింది. ప్రస్తుతానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 49 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: Viral News: యో చూస్కోబడ్లా..భర్త అనుకుని వేరే వ్యక్తి బైక్పై వెళ్లిన భార్య
తాజావార్తలు
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?