US tariff on India: ట్రంప్ టారిఫ్ బాంబ్.. స్పందించిన భారత్.. ఏమన్నదంటే?
- ట్రంప్ టారిఫ్ బాంబ్
- ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది
- అన్యాయం, దురదృష్టకరమని పేర్కొంది
- ట్రంప్ 50% సుంకం ఆర్థిక బ్లాక్మెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను ప్రకటించిన తర్వాత కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. “ఇటీవలి రోజుల్లో, రష్యా నుంచి భారతదేశం చేసుకునే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితమైనవి. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారించడం దాని ప్రధాన లక్ష్యం అనే విషయంతో సహా ఈ అంశాలపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేసాము. “అనేక ఇతర దేశాలు తమ జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలకు గాను భారతదేశంపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించడం చాలా దురదృష్టకరం.
Also Read:Samsung Galaxy F05: సామ్ సంగ్ ఫోన్ రూ. 6000 కంటే తక్కువ ధరకే.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
Also Read
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ఈ చర్యలు అన్యాయమైనవి, అస్థిరమైనవి అని మేము పునరుద్ఘాటిస్తున్నాము. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది” అని ఆ ప్రకటన పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిని అన్యాయం, దురదృష్టకరమని పేర్కొంది. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటే, సుంకాలను కూడా పెంచవచ్చని ట్రంప్ అన్నారు.
Also Read:Minister Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. యువత – పరిశ్రమల అనుసంధానం..!
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ‘ఇటీవలి కాలంలో రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ అంశంపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేసాము. మా దిగుమతులు మార్కెట్ అంశాలపై ఆధారపడి ఉంటాయనే వాస్తవాన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము’ అని అన్నారు. ‘భారతదేశం దిగుమతులు 1.4 బిలియన్ల ప్రజలకు ఇంధన భద్రతను నిర్ధారించే లక్ష్యంతో జరుగుతున్నాయి. ట్రంప్ తీసుకున్న చర్య తగనిది, అవివేకం. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుంది’ అని ఆయన అన్నారు.
Also Read:Rakshabandhan Gifts: రాఖీ స్పెషల్.. మీ సోదరికి ట్రెండీ గాడ్జెట్లను గిఫ్ట్ గా ఇవ్వండి.. బెస్ట్ ఇవే!
అమెరికా సుంకాల ప్రకటనపై రాహుల్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ, “ట్రంప్ 50% సుంకం ఆర్థిక బ్లాక్మెయిల్. ఇది భారతదేశాన్ని అన్యాయమైన వాణిజ్య ఒప్పందంలోకి భయపెట్టే ప్రయత్నం. ప్రధానమంత్రి మోడీ తన బలహీనత భారత ప్రజల ప్రయోజనాలను అధిగమించనివ్వకూడదు” అని అన్నారు.
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!