BCCI: ఇక వారికే వదిలేస్తున్నాం.. భారత్-పాక్ వివాదంపై బీసీసీఐ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan controversy: టీ 20 వరల్డ్ కప్కు ముందు పాకిస్థాన్ మూర్ఖ వైఖరి గురించి అందరికీ తెలిసిందే. భద్రతా అంశాన్ని తెరపైకి తెచ్చిన పాక్.. భారత్తో మ్యాచ్ ఆడేందుకు నో చెప్పింది. టీ20 వరల్డ్ కప్కు ముందు భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై మరోసారి చర్చలు తెరపైకి వచ్చాయి. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్తో జరిగే మ్యాచ్లను పాకిస్థాన్ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై తాజాగా భారత క్రికెట్ బోర్డు(BCCI) స్పందించింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఈ విషయంలో బోర్డు వైఖరి చాలా క్లియర్గా ఉందని స్పష్టం చేశారు. తాజాగా ANIతో మాట్లాడిన ఆయన.. “పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలపై బీసీసీఐకి చెప్పాల్సిందేమీ లేదు. ఈ నిర్ణయం పూర్తిగా ఐసీసీ పరిధిలో ఉంటుంది. ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటే, మేం అదే పాటిస్తాం,” అని తెలిపారు. అంటే ఈ వివాదంలో భారత్ తుది తీర్పును ఐసీసీకే వదిలేసింది.
Also Read
- AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
- Star Batter: ఆ ప్లేయర్కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
- Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
ఇదిలా ఉండగా.. బుధవారం ఇస్లామాబాద్లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. శ్రీలంకలో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను తమ జట్టు ఆడబోదని మరోసారి ప్రకటించారు. “ఈ విషయంలో మేం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. భారత్తో మ్యాచ్ ఆడబోం. ఈ నిర్ణయం తొందరపాటులో తీసుకున్నది కాదు. బాగా ఆలోచించి, అన్ని కోణాలు చూసిన తర్వాతే ఈ స్టాండ్ తీసుకున్నాం” అని తెలిపారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని చెబుతూనే, భారత్తో మ్యాచ్ను బహిష్కరించడమే సరైన నిర్ణయమని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇది తొలిసారి చేసిన ప్రకటన కాదు. దీనికంటే ముందే పాకిస్థాన్ ప్రభుత్వం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన చేసింది. భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు ఆడబోదని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సరైన కారణం మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాతే ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పెద్ద చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఒకవైపు పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా నిలబడుతుంటే, మరోవైపు బీసీసీఐ నిర్ణయాన్ని ఐసీసీ చేతుల్లో పెట్టింది. ఇప్పుడు ఏం జరగనుందో ఐసీసీ నిర్ణయించాలి.
తాజావార్తలు
-
AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
-
Star Batter: ఆ ప్లేయర్కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
-
Naagin: ‘నాగిన్’ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఇక థియేటర్లలో నాగరాణుల మహామేళా.. శ్రీదేవి రికార్డు బద్దలవుతుందా?
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Dhruv Vikram : అనుపమతో బ్రేకప్.. కామెంట్స్ పై ధృవ్ విక్రమ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!