India-Ukraine: ఉక్రెయిన్కు మద్దతుగా సంతకం చేయని భారత్.. కారణమేంటంటే..!
- ఉక్రెయిన్కు మద్దతుగా సంతకం చేసేందుకు భారత్ నిరాకరణ
- స్విట్జర్లాండ్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాని రష్యా
- ఇలాగైతే శాంతి చర్చలకు పరిష్కారం దొరకదన్న భారత్
- భారత్తో సహా పలు దేశాలు సంతకాలు చేసేందుకు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్విట్జర్లాండ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో శాంతికి ముందడుగు పడే అవకాశం లేదని.. దీని వలన సమయం వృధా అని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో సంతకం చేసేందుకు భారత్ ముందుకు రాలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా 50 మందికి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు.. ఇందుకోసం ఒక మార్గాన్ని రూపొందించడానికి స్విట్జర్లాండ్లో రెండు రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రష్యా మాత్రం హాజరుకాలేదు. స్విస్ ఆల్పైన్ రిసార్ట్ ఆఫ్ స్టాన్స్స్టాడ్లో రెండు రోజుల చర్చలు జరిగాయి.
Also Read
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
ఈ సమావేశానికి ఇండియా తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఉక్రెయిన్లో చర్చల ద్వారా పరిష్కారానికి మార్గాలను అన్వేషించడం భారత్ ఉద్దేశం అని కపూర్ తెలిపారు. అన్ని పక్షాలు చర్చల్లో భాగం కావాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. మా విధానం స్థిరంగా ఉందని.. సమాధానం లేదా దౌత్యం ద్వారా మాత్రం శాశ్వత శాంతికి మార్గం చూపించొచ్చని భారత్ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆచరణాత్మక పరిష్కారం చూపించాలని భారత్ అభిప్రాయపడింది.
సమ్మిట్లో దేశాధినేతలతో సహా 100కి పైగా దేశాలు మరియు సంస్థల నుంచి ప్రతినిధులు స్విట్జర్లాండ్లో సమావేశం అయ్యారు. చైనా కూడా హాజరు కావడం విశేషం. కొన్ని దేశాలు ఉక్రెయిన్ మద్దతుగా సంతాకాలు చేయగా.. భారత్తో పాటు ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు శాంతి పత్రంలో సంతకాలను నిలిపివేసినట్లు వార్తా సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!