India Open 2025: ఇండియా ఓపెన్ బరిలో కొత్త పెళ్లి కూతురు!
- జనవరి 14 నుంచి ఇండియా ఓపెన్
- ఇండియా ఓపెన్ బరిలో పీవీ సింధు
- ఇండియా ఓపెన్లో భారీ బృందంతో భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీ ఢిల్లీ వేదికగా జనవరి 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్, కొత్త పెళ్లి కూతురు పీవీ సింధు పాల్గొననున్నారు. వివాహం తర్వాత సింధు పాల్గొనే తొలి టోర్నీ ఇదే. గతేడాది చివర్లో ఉదయ్పూర్లో వెంకట దత్త సాయితో సింధు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2025 సీజన్ను త్వరగా ఆరంభించేందుకే డిసెంబర్లో తాను వివాహం చేసుకున్నానని ఒలింపిక్ విజేత చెప్పారు. టోర్నీ కోసం సింధు ఇప్పటికే భర్తతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.
ఈ టోర్నీలో భారత్ నుంచి భారీ బృందం పాల్గొంటుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్.. మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక బాన్సోద్, అనుపమ ఉపాధ్యాయ, ఆకర్షి కశ్యప్ పాల్గొంటున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి జోడీ, సాయి ప్రతీక్-పృథ్వీ జంట బరిలో దిగనుంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, మృణ్మయీ దేశ్పాండే-ప్రేరణ ఆల్వేకర్, అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో, అశ్విని భట్-శిఖ గౌతమ్, రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా, సాక్షి గహ్లావత్-అపూర్వ గహ్లావత్, మానస రావత్-గాయత్రి రావత్, సానియా సికందర్-రష్మి గణేశ్ జోడీలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
భారత్ నుంచి మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో, సతీశ్కుమార్-ఆద్య వరియత్, రోహన్ కపూర్-రుత్విక శివాని, ఆషిత్ సూర్య-అమృత ప్రముతేష్ బరిలో దిగుతున్నారు. మొత్తంగా భారత్ తరఫున పురుషుల సింగిల్స్లో ముగ్గురు, మహిళల సింగిల్స్లో నలుగురు, పురుషుల డబుల్స్లో రెండు జంటలు, మహిళల డబుల్స్లో ఎనిమిది జోడీలు, మిక్స్డ్లో నాలుగు జంటలు బరిలో ఉన్నాయి. ఒలింపిక్ ఛాంపియన్లు విక్టర్ అక్సెల్సెన్, ఆన్ సియంగ్ సహా ప్రపంచ నంబర్వన్ షై యుకి కూడా ఇండియా ఓపెన్లో బరిలో దిగుతున్నారు. విజేతలకు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించనున్నాయి.
తాజావార్తలు
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..