India Open 2025: ఇండియా ఓపెన్ బరిలో కొత్త పెళ్లి కూతురు!
- జనవరి 14 నుంచి ఇండియా ఓపెన్
- ఇండియా ఓపెన్ బరిలో పీవీ సింధు
- ఇండియా ఓపెన్లో భారీ బృందంతో భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నీ ఢిల్లీ వేదికగా జనవరి 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో భారత స్టార్ షట్లర్, కొత్త పెళ్లి కూతురు పీవీ సింధు పాల్గొననున్నారు. వివాహం తర్వాత సింధు పాల్గొనే తొలి టోర్నీ ఇదే. గతేడాది చివర్లో ఉదయ్పూర్లో వెంకట దత్త సాయితో సింధు వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2025 సీజన్ను త్వరగా ఆరంభించేందుకే డిసెంబర్లో తాను వివాహం చేసుకున్నానని ఒలింపిక్ విజేత చెప్పారు. టోర్నీ కోసం సింధు ఇప్పటికే భర్తతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.
ఈ టోర్నీలో భారత్ నుంచి భారీ బృందం పాల్గొంటుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్.. మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక బాన్సోద్, అనుపమ ఉపాధ్యాయ, ఆకర్షి కశ్యప్ పాల్గొంటున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి జోడీ, సాయి ప్రతీక్-పృథ్వీ జంట బరిలో దిగనుంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ, మృణ్మయీ దేశ్పాండే-ప్రేరణ ఆల్వేకర్, అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో, అశ్విని భట్-శిఖ గౌతమ్, రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా, సాక్షి గహ్లావత్-అపూర్వ గహ్లావత్, మానస రావత్-గాయత్రి రావత్, సానియా సికందర్-రష్మి గణేశ్ జోడీలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
భారత్ నుంచి మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో, సతీశ్కుమార్-ఆద్య వరియత్, రోహన్ కపూర్-రుత్విక శివాని, ఆషిత్ సూర్య-అమృత ప్రముతేష్ బరిలో దిగుతున్నారు. మొత్తంగా భారత్ తరఫున పురుషుల సింగిల్స్లో ముగ్గురు, మహిళల సింగిల్స్లో నలుగురు, పురుషుల డబుల్స్లో రెండు జంటలు, మహిళల డబుల్స్లో ఎనిమిది జోడీలు, మిక్స్డ్లో నాలుగు జంటలు బరిలో ఉన్నాయి. ఒలింపిక్ ఛాంపియన్లు విక్టర్ అక్సెల్సెన్, ఆన్ సియంగ్ సహా ప్రపంచ నంబర్వన్ షై యుకి కూడా ఇండియా ఓపెన్లో బరిలో దిగుతున్నారు. విజేతలకు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించనున్నాయి.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!