WTC Final రేసులో భారత్ ఉండాలంటే.. 8 విజయాలు సాధించాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Final: కోల్కాతా టెస్ట్లో టీమిండియా ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భారత్ పరిస్థితి కాస్త సంక్లిష్టంగా మారింది. ఇప్పటివరకు శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మూడు టెస్ట్ల్లో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సైకిల్లో మొత్తం నాలుగు విజయాలే సాధించగలిగిన భారత్.. టాప్-2 స్థానాల్లోకి చేరేందుకు భారీ సవాల్ను ఎదుర్కోతోంది. కానీ పోటీ అప్పుడే పూర్తిగా ఐపోలేదు. ప్రస్తుతం భారత్ సుమారు 54% పాయింట్స్ శాతంతో నాల్గవ స్థానంలో ఉంది. సాధారణంగా WTC ఫైనల్కు అర్హత పొందేందుకు అవసరమైన PTC 64% నుంచి 68% మధ్య ఉంటుంది. అందువల్ల మిగిలిన మ్యాచ్ల్లో ఎక్కువ భాగాన్ని భారత్ గెలవాల్సిందే. లేకపోతే ఒక్కో తప్పిదం కూడా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
భారత్కి మిగిలిన WTC మ్యాచ్ లు:
* దక్షిణాఫ్రికాతో హోమ్ సిరీస్ – 1 టెస్ట్.
* శ్రీలంకలో సిరీస్ – 2 టెస్టులు.
* న్యూ జిలాండ్లో సిరీస్ – 2 టెస్టులు.
* ఆస్ట్రేలియాతో హోమ్ సిరీస్ – 5 టెస్టులు
ఈ మొత్తం 10 టెస్టులన్నింటినీ గెలిస్తే భారత్ పాయింట్ల సంఖ్య 172కి చేరుతుంది. ఇప్పటికే భారత జట్టు 18 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు ఆడేసింది. మిగిలిన మ్యాచ్లలో భారత్ సాధించే విజయాలపై ఆధారపడి పీసీటీ మారుతుంది. ఇందులో 5 విజయాలు సాధిస్తే 51.85%, 6 విజయాలు సాధిస్తే 57.41%, 7 విజయాలు సాధిస్తే 62.96%, 8 విజయాలు సాధిస్తే 68.52%, 9 విజయాలు సాధిస్తే 74.07%, 10 విజయాలు సాధిస్తే 79.63% గా చేరుతుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. WTC ఫైనల్కు సురక్షితంగా చేరాలంటే భారత్ కనీసం 8 విజయాలు సాధించాల్సిందే. అప్పుడు మాత్రమే పీసీటీ 68% దాటే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మూడు సైకిల్లు ముగిసాయి, వాటిలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఒక్కొక్కసారి చాంపియన్ అయ్యాయి. గత రికార్డులు చూస్తే.. సాధారణంగా 68% పరిధిలో PTC ఉన్న జట్లు ఫైనల్కు అర్హత పొందుతున్నాయి. ఈ అంచనా ప్రకారం భారత్ మరోసారి WTC ఫైనల్ ఆడాలంటే అసాధారణ ప్రదర్శన తప్పనిసరి. మిగిలిన 10 టెస్టుల్లో కనీసం 8 విజయాలను లక్ష్యంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!