Brian Lara: రోహిత్-కోహ్లీ ఓపెనింగ్ జోడీని కొనసాగించాలి..
- భారత్ రోహిత్-కోహ్లీ ఓపెనింగ్ జోడీని కొనసాగించాలి- బ్రియాన్ లారా
- రానున్న మ్యాచ్ల్లో పెద్ద స్కోరు చేస్తాడంటున్న లారా
- ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోని విరాట్ కోహ్లీ
- ఆడిన మూడు మ్యాచ్లలో సింగిల్ డిజిట్కే పరిమితం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోతున్నారు. అయినప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఓపెనింగ్ జోడీని భారత్ కొనసాగించాలని లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో సింగిల్ డిజిట్కే (1, 4, 0) పరిమితమయ్యాడు. మరోవైపు.. రోహిత్ ఐర్లాండ్పై హాఫ్ సెంచరీతో రాణించాడు.. ఆ తర్వాతి రెండు మ్యాచ్లలో 13, 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. వీరిద్దరూ తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ఈ జోడీ మాత్రమే ఓపెనింగ్ చేయాలని లారా సూచించారు.
Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు
Also Read
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
“భారత్కు ఎడమ-కుడి ఓపెనింగ్ భాగస్వామ్యం చేయగలే అవకాశం ఉంది. అయితే.. ఈ మెగా టోర్నీలో ఇద్దరు గొప్ప ఆటగాళ్లతో ఓపెనింగ్ కు వెళ్లారు. వీరిద్దరు ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చూపించారు. అయితే.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తే.. జట్టులో ఆట తీరుపై ప్రభావం చూపవచ్చు” అని స్టార్ స్పోర్ట్స్లో లారా పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రాబోయే మ్యాచ్ల్లో పెద్ద స్కోరు చేయగలుగుతారని తెలిపారు. అమెరికాలో బ్యాటింగ్ పరిస్థితులు బాగా లేవు. అందుకోసమని భారత్ ఇప్పటి వరకూ ఆడిన 3 మ్యాచ్ల్లో గెలిచింది కావున.. మార్పులు చేయదని అనుకుంటున్నట్లు తెలిపారు.
Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎం యడియూరప్పకి అరెస్ట్ వారెంట్ జారీ..
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ సూపర్-8కు చేరింది. మిగిలిన ఏకైక బెర్తు కోసం అమెరికా, పాకిస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం మూడు మ్యాచ్లు ఆడిన అమెరికా.. రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్ల (+0.127 నెట్రన్రేట్)తో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ మూడు మ్యాచ్లలో ఒకటి నెగ్గి.. రెండు పాయింట్ల (+0.191 నెట్రన్రేట్)తో మూడో స్థానంలో ఉంది. కెనడా, ఐర్లాండ్ జట్ల నెట్రన్రేట్ మైనస్లో ఉండడంతో రేసులో లేవు. మరోవైపు.. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కెనడాతో శనివారం ( జూన్ 15) సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్హిల్, ఫ్లోరిడాలో తలపడనుంది.
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!